భారత యంగ్ క్రికెటర్ కమ్ వైస్-కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సెక్సీ నటి అనుష్క శర్మల మధ్య కొన్నాళ్ల నుంచి నడుస్తున్న ప్రేమవ్యవహారం గురించి అందరికీ తెలిసిందే! తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్సేనని కబుర్లు చెబుతున్నా.. వీరి వ్యవహారాలు మాత్రం హద్దుమీరిపోయేలా కనిపిస్తున్నాయి. మొన్నటికిమొన్న ఇంగ్లాండ్ క్రికెట్ టూర్ లో సంచలనం రేపిన ఈ జంట.. తాజాగా మరోసారి ఉప్పల్ స్టేడియంలో అట్రాక్షన్ గా నిలిచిపోయారు. స్టేడియంలో క్రికెట్ అభిమానులతోపాటు రాజకీయ-సినీ-ఇతర రంగాల్లో ప్రముఖులైన వారందరూ చూస్తుండగానే వీరిద్దరూ తమ ముద్దుల పండుగను జరిపేసుకున్నారు.
భారత్-శ్రీలంకల మూడో వన్డే ఆరంభానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఇరుజట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగానే తెలుగు ఆటగాడు రాయుడు చేతిని అభిమానంతో ముద్దాడారు. అందరూ బాగా ప్రదర్శించాలని ఆయన కోరుతూ అక్కడి నుంచి వెళ్లారు. ఆ తర్వత లంక మొదటి ఇన్నింగ్స్ ఆడటం.. ఇండియా ఆటగాళ్లు బ్యాట్ తో బరిలోకి దిగడం జరిగింది. ఓవైపు క్రికెట్ అభిమానులు భారత ఆటగాళ్ల ప్రదర్శనకు సందడి చేస్తున్నారు. ఇండియా గెలుపు దిశగా దూసుకుపోతోంది. అయితే విరాట్ కోహ్లీ బరిలోకి దిగగానే మ్యాచ్ మరింత ఆసక్తిగా మారిపోయింది. అదే సమయంలో అనుష్క కూడా స్టేడియంలోకి రావడంతో కాస్త వ్యవహారం వీరిద్దరివైపు మళ్లింది.
మ్యాచ్ ఆరంభం నుంచి అనుష్క కనిపించలేదు కానీ.. సాయంత్రం భారత ఇన్నింగ్ సమయానికి అనుష్క స్టేడియంకు వచ్చింది. ఇక అప్పుడే బ్యాట్ తో స్టేడియంలోకి వెళ్లిన కోహ్లీ.. తన మనసులోని భావాలను కంట్రోల్ చేసుకోలేక అనుష్కకు ముద్దులమీద ముద్దులు ఇచ్చేశాడు. అతను ఆడుతున్నంతసేపూ ఏమాత్రం ఖాళీ దొరికినా.. అనుష్కను చూసి విరాట్ స్మైల్ ఇవ్వడం చేశాడు. ఇక అర్థసెంచరీ పూర్తికాగానే తన గర్ల్ ఫ్రెండ్ అనుష్కకు బ్యాట్ తో కిస్ ఇచ్చాడు. అందుకు అనుష్క కూడా స్పందించి సిగ్గుపడుతూ మురిసిపోయింది. అబ్బో.. మ్యాచ్ కంటే వీళ్ల ‘కిస్ ఆఫ్ లవ్’’ వ్యవహారమే అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయిందిలెండి!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more