భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాను రాసుకున్న ఆత్మకథ ‘‘ప్లేయింగ్ ఇట్ మై వే’’ పుస్తకాన్ని బుధవారం(05-11-2014)నాడు విడుదల చేసిన సంగతి తెలిసిందే! ఈ వేడుక సందర్భంగా ఎందరో సీనియర్ ఆటగాళ్లు, ఇతర బిజినెస్ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే సచిన్ కుటుంబసభ్యులు కూడా ఇందుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సచిన్ భార్య అంజలి తమ మధ్య జరిగిన ప్రేమవ్యవహారాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మొదట్లో సచిన్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నా అంతగా పట్టించుకోలేదని.. అయితే తర్వాత తొలిసారి చూసినప్పుడు చాలా ముద్దుగా కనిపించాడని.. అప్పటినుంచి అతని వెంటపడ్డానని తెలిపింది. ఈ విషయాలన్నీ అంజలి మాటల్లోనే...
‘‘సచిన్ గురించి మొదట్లో అందరూ చెబుతున్నా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే.. అప్పట్లో నాకు క్రికెట్ అంటే ఏమాత్రం ఆసక్తి లేదు. నేను ఇంగ్లాండ్లో ఉండగా మ్యాచ్ల కోసమని సచిన్ అక్కడికి వచ్చాడు. ఆ టోర్నీలో అతను సెంచరీ చేసి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంల మా అంకుల్ తనను కలవమని చెప్పారు కానీ.. నాకు ఆసక్తి లేకపోవడం వల్ల వెళ్లలేదు. అలా గడిచిన కొన్నాళ్ల తర్వాత అతణ్ని తొలిసారి చూసినప్పుడు భలే ముద్దుగా ఉన్నాడనిపించింది. ఆ తర్వాత నుంచే అతడి వెంట పడ్డా. అతనితో కలిసి ఒకసారి మాట్లాడాలనిపించింది. కానీ అప్పట్లో ఆ అవకాశం రాలేదు’’.
‘‘ఓసారి ఎయిర్పోర్ట్లో నేను మా అమ్మ కోసం ఎదురు చూస్తుండగా సరిగ్గా ఆ సమయంలోనే సచిన్ అక్కడికి వచ్చాడు. అప్పుడు నేను మా అమ్మ సంగతి మరిచిపోయి అతడి కోసం పరుగెడుతూ.. ‘‘సచిన్ సచిన్’’ అంటూ అరిచాను. అయితే అప్పుడు తనతోపాటు అజిత్, నితిన్ ఉండటంతో సిగ్గుపడుతూ వెళ్లిపోయాడు. తర్వాత సచిన్ స్నేహితుడి దగ్గర నుంచి అతని ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేశాను. అప్పుడే తనే ఫోన్ తీసి మాట్లాడాడు. ఆ సంభాషణ నేపథ్యంలో మొదట ఎయిర్పోర్ట్ సంఘటన గురించి వివరించాను. దాంతో అతను గుర్తుపట్టాడు. ఆ సమయంలో నేను వేసుకున్న నారింజ రంగు టీషర్ట్ విషయం కూడా చెప్పాడు. సచిన్కు 17 ఏళ్లున్నపుడు అతణ్ని తొలిసారి చూశా. 15 ఏళ్లకే అతణ్ని చూసి ఉంటే.. అప్పుడే అతడి వెంటపడేదాన్నేమో’’.
1990లో సచిన్ను తొలిసారి కలిశాను. ఆ సమయంలో మొబైల్స్, ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్లు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. నేను వైద్య కళాశాలలో చదువుకునే సమయంలో రాత్రి పదిగంటల తర్వాత పీసీవో బూత్లకు వెళ్లి సచిన్కు కాల్ చేయాల్సి వచ్చేది. రాత్రి సమయంలో అయితేనే ఐఎస్డీ ధరలు తక్కువుండేవి. ఫోన్ చేసినా.. క్షణ క్షణం డబ్బులు కరిగిపోవడం చూస్తూ ఫోన్ మాట్లాడేదాన్ని. ఈ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సచిన్కు ఎక్కువగా ఉత్తరాలు రాసేదాన్ని. ‘‘సచిన్కు 21 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదని చెప్పాడు. అతను న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా నాకు ఫోన్ చేసి.. మా పెళ్లి విషయంలో తన ఇంట్లో నేనే మాట్లాడాలని చెప్పాడు. నేనే వెళ్లి వాళ్లింట్లో వాళ్లతో మాట్లాడాను’’.
‘‘అయితే నేను తొలిసారి సచిన్ ఇంటికెళ్లినప్పుడు ఇంటర్వ్యూ కోసం వచ్చిన పాత్రికేయురాలిగా నటించమన్నాడు. దాంతో నేను సల్వార్ కమీజ్ వేసుకుని అందంగా తయారయి వెళ్లాను. ఆ సమయంలో సచిన్ వదిన నన్ను అనుమానంగా చూసింది. నిజంగా పాత్రికేయురాలినేనా అని సందేహించింది. అయితే ఆ తర్వాత మొత్తం వ్యవహారం వివరించాను’’ అని పేర్కొంది అంజలి!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more