గత సంవత్సరాల నుండి క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలకు, ఊహాగానాలకు తెర దించుతూ సంచలనాత్మకమైన ప్రకటన చేశాడు. గత రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తూ, ప్రపంచ రికార్డుల్ని సొంతం చేసుకొని కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఇప్పటికే టి20, వన్డేలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక టెస్టులకు కూడా గుడ్ బై చెబుతున్నట్లు నేడు ప్రకటించాడు. త్వరలో మన దేశంలో విండీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ తరువాత క్రికెట్ కి దూరంగా ఉంటానని చెప్పాడు.
త్వరలో తాను ఆడబోయే చరిత్రాత్మక 200వ టెస్టు అనంతరం వైదొలగనున్నాడు. గతంలోనే సచిన్ విండీస్ సిరీస్ తరువాత తప్పుకోబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ వచ్చిన సచిన్ సడెన్ గా ఈ నిర్ణయాన్ని వెల్లడించడంతో అందరు షాక్ కి గురయ్యారు. . సచిన్ రిటైర్మెంట్ తో అంతర్జాతీయ క్రికెట్లో ఓ శకం ముగియనుంది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్మన్ మాజీ గా మారబోతున్నాడు. తన కెరీర్ను పూర్తిగా ఆస్వాదించానని సంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు అండగా నిలిచిన అభిమానులకు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ మేరకు బీసీసీఐ లేఖ రాశాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సచిన్ తాను భారత్ తరుపున క్రికెట్ ఆడటం తన జీవిత కాల స్వప్నం అని, కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి రోజు ఒకే కలతో బతుకుతున్నానని, 11 ఏళ్ళ వయస్సు నుండి క్రికెట్ ఆడుతున్నానని, ఇప్పుడు క్రికెట్ లేని జీవితాన్ని ఊహించుకోలేనని సచిన్ అన్నాడు. వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టుల్లో 15,837 పరుగులు సాధించిన ఈయన 51 శతకాలు, 67 అర్థ శతకాలు సాధించాడు. వన్డేల్లో అత్యథికంగా 198 పరుగులు చేసి రికార్డు స్రుష్టించాడు. 200 వ టెస్టులో చివరిసారిగా కనిపించనున్న సచిన్ లేని క్రికెట్ ని ఊహించుకోవడం కాస్త కష్టమేనేమో ?
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more