క్రీడా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మంగా భావించి ఒలంపిక్స్ క్రీడల్లో మన భారత దేశానికి బాక్సింగ్ విభాగంలో తొలి పతకాన్ని అందించిన బాక్సర్ విజేందర్ సింగ్ మెడకు డ్రగ్స్ కుంభకోణం చుట్టుకుంది. గతంలో క్రీడా రంగంలో ఎన్నో మ్యాచ్ ఫిక్సింగ్ లు, డోపింగ్ టెస్టుల్లో దోషులుగా తేలిన సందర్భాలు ఉన్నాయి కానీ, ఓ క్రీడాకారుడికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని తేలడం ఇదే మొదటిసారి కావచ్చు. చండీగఢ్ శివారులో ఉన్న జిరాక్పూర్లోని ఓ ప్రవాస భారతీయుని ఇంట్లో గురువారం సాయంత్రం పంజాబ్ పోలీసులకు భారీ స్థాయిలో 26 కిలోల హెరాయిన్ పట్టుబడింది. రూ.130 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు దొరికిన ఈ ఫ్లాట్ బయట విజేందర్ భార్య కారు ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయం ఓ డీలర్ ద్వారా విషయం బయటపడింది. దీంతో దీని వెనుక ఉన్న మాఫియా బండారం బయటకు వచ్చింది. ఈ కేసులో విజెందర్ కి ఉన్న సంబంధం ఏమిటన్నది తేలాలి. ఈ విషయం పై స్పందించిన విజెందర్ సింగ్ జిరాక్పూర్లోని ఫ్లాట్ వద్దకు ఆ కారు ఎలా చేరిందో నాకు తెలీదు. నన్ను విమానాశ్రయం వద్ద దింపాక నా స్నేహితులు ఆ కారును వాడి ఉంటారు. ఇందులోకి నా పేరును ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. నాకు ఏపాపం తెలియదని అంటున్నాడు. అయితే క్రీడాకారులు చాలా మందే తన స్టామినాను పెంచుకోవడానికి డ్రగ్స్ తీసుకుంటారు. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి రూ. కోటి నగదు, 20 కిలోల కెమికల్స్ను స్వాధీనం చేసుకున్నట్టు లూధియానా రేంజి డీఐజీ ఎం ఫరూఖి తెలిపారు. అయితే బాక్సర్ విజేందర్కు డ్రగ్స్ కేసులో సంబంధాలపై ఇప్పటిదాకా ఏమీ తేలలేదని, విచారణ సాగుతోందని చెప్పారు. కానీ విజెందర్ కి ఇందులో హస్తం ఉందో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ అతని హస్తం ఉన్నట్లు రుజువు అయితే అతని కెరియర్ క్లోజ్ అయినట్లే.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more