ఆల్ ఇంగ్లండ్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలో భారత్కు మిశ్రమ ఫలితాలు లభించాయి. మేటి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్కి చేరగా... రైజింగ్ స్టార్ పీవీ సింధుతో పాటు మిక్స్డ్ డబుల్స్ జోడి జ్వాల-దిజు టోర్నీ నుంచి నిష్ర్కమించింది. మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా 21-16, 21-11తో 42వ ర్యాంకర్ బెలాట్రిక్స్ మనుపుటి (ఇండోనేసియా)పై విజయం సాధించింది. సైనాకు తొలి గేమ్లో కాస్త ప్రతిఘటన ఎదురైనా పదునైన స్మాష్లతో ప్రత్యర్థిని కట్టడి చేసింది. అనంతరం రెండో గేమ్లో ఈ హైదరాబాదీకి అడ్డే లేకుండా పోయింది. ఈ మ్యాచ్ మొత్తం 34 నిమిషాల పాటు సాగింది. మరో ప్రి క్వార్టర్ ఫైనల్లో సింధు వరుస గేముల్లో నాలుగో సీడ్ జులియన్ షెంక్ (జర్మనీ) చేతిలో పరాజయం చవిచూసింది. ప్రపంచ 16వ ర్యాంకు క్రీడాకారిణి అయిన సింధు ఆరంభంలో దూకుడు కనబరిచినప్పటికీ తన కన్నా మెరుగైన ర్యాంకింగ్ ప్రత్యర్థి ముందు నిలువలేకపోయింది. చివరకు ఏపీ అమ్మాయి 17-21, 14-21తో ఓటమి పాలైంది. 39 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్లో కనబరిచిన పోరాటపటిమను రెండో గేమ్లో కనబరచలేకపోయింది. స్మాష్లతో తొలి గేమ్ ఆరంభంలో 5-1తో జోరు మీదున్న సింధు ఒక దశలో 15-12 స్కోరు వరకు ఆధిక్యంలో నిలిచింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో... సైనా నెహ్వాల్ రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది. విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ప్రపంచ చాంపియన్ యిహాన్ వాంగ్ (చైనా) రెండో ర్యాంక్కు ఎగబాకింది. జురుయ్ లీ (చైనా) టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో ఈ ఇద్దరు తొలి రౌండ్లోనే పరాజయం చెందడంతో మరోసారి మెరుగైన ర్యాంక్ను సాధించుకునే అవకాశం సైనాకు ఉంది. పి.వి.సింధు 16వ ర్యాంక్ను నిలబెట్టుకుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more