రెజ్లింగ్ను (కుస్తీ) 2020 ఒలింపిక్నుంచి తొలగిస్తూ ఐఓసి తీసుకున్న నిర్ణయంపై భారత ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ మండిపడ్డాడు. ఆధునిక క్రీడ అయిన కుస్తీ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రాచుర్యం ఉందని, అందువల్ల టీవీ రేటింగ్ లేదనడం సరిగాదన్నాడు. లండన్ ఒలింపిక్స్ సమయంలో కుస్తీ పోటీలను విరివిగా తిలకించారు. టిక్కెట్లే దొరకలేదు. నేను అమెరికాలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో అధ్యక్షుడు ఒబామా స్వయంగా విచ్చేసి పోటీలను తిలకించారని సుశీల్ తెలిపాడు. కాబట్టి రెజ్లింగ్ ప్రాచుర్యం పొందని క్రీడ అనడం కరెక్టు కాదన్నాడు. వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకాలు గెలుచుకుని వచ్చిన సుశీల్ కుమార్ ఇంకా మాట్లాడుతూ అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే యువ రెజ్లర్స్కు ఆశనిపాతమని వ్యాఖ్యానించాడు. వీరంతా 2020 ఒలింపిక్స్కు కష్టపడి తయారవుతున్నారని చెప్పాడు. మరో లక్ష్యం లేకుండా కేవలం ఒలింపిక్స్పై దృష్టి పెట్టిన రెజ్లర్లందరికీ తీవ్ర నిరాశ కలిగించే అంశమని అన్నాడు. లండన్ ఒలింపిక్స్లో విజయవంతంగా మన రెజ్లర్స్ పతకాలు గెలుచుకుని వచ్చారు. కాబట్టి ఐఓసి తీసుకున్న నిర్ణయం వీరిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందన్నాడని సుశీల్ కోచ్ మహాబలి సత్పాల్ తెలిపాడు. లండన్ ఒలింపిక్స్లో సాధించిన విజయాలతో మనవాళ్లు రాబోయే ఒలింపిక్స్లో మరిన్ని పతకాలు అందుకోవచ్చుననే ఆశాభావంతో ఉండగా, వీరందరికీ ఈ నిర్ణయం రెజ్లింగ్ ఇక మానేయవచ్చునన్న అభిప్రాయాన్ని ఏర్పరుస్తున్నదని అన్నారు. రెజ్లింగ్ ప్రాచుర్యం పొందలేదనడం సరికాదన్నారు. బ్రెజిల్లో జరిగే ఒలింపిక్స్లో మనకు తప్పకుండా 6-7 పకతాలు దక్కుతాయని అనుకుంటున్నాం. ఇప్పుడు వారంతా ఎంతో ఆవేదన చెందుతున్నారని వ్యాఖ్యానించాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more