ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు ప్రత్యర్థి జర్మనీ జట్టుపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. దీంతో దాదాపు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించింది. 1980 సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత ఇన్నాళ్లకు కాంస్య పతకం సాధించింది. జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్ 5-4 తేడాతో చిత్తు చేసింది టీమిండియా.
41 సంవత్సరాల సుధీర్ఘ విరామం అనంతరం పతకాన్ని సాధించి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది. మ్యాచ్ లో రెండు, మూడు క్వార్టర్స్ లో భారత స్ట్రయికర్లు సత్తా చాటగా.. ఆఖరి క్వార్టర్లో జర్మనీ క్రీడాకారులు దూకుడు ప్రదర్శించినా.. డిఫెండర్లు, గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. పలు పెనాల్టీ కార్నర్లను గోల్ కాకుండా అడ్డుకొని ఒలింపిక్ పతకాన్ని ఒడిసిపట్టారు. మ్యాచ్లో మొదటి క్వార్టర్లో 0-1 గోల్స్తో భారత జట్టు వెనుకపడింది.
రెండో క్వార్టర్లో కెప్టెన్ సిమ్రన్ జీత్ ఒక గోల్ సాధించి.. స్కోరును 1-1 సమమం చేయగా, జర్మనీ ఆటగాళ్లు రెండు గోల్స్ చేసి ఆధిక్యాన్ని కబర్చారు. కాగా, భారత్ ఆటగాళ్లు హర్ధిక్ సింగ్, హర్మన్ ప్రీత్ చేసిన గోల్స్ తో రెండో క్వార్టర్ సమంగా మారింది. మూడోక్వార్టర్లో జర్మనీపై భారత్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించి 5-3తో ఆధిక్యంలో నిలిచారు. అయితే నాలుగో క్వార్టర్లో జర్మనీ గోల్ సాధించి ఆధిక్యాన్ని 5-4కు తగ్గించింది. స్కోర్ను సమం చేసేందుకు జర్మనీ ఎంత ప్రయత్నించినా భారత ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more