అటగాళ్లపై ఫాన్సుకు ఉండే అభిమానాన్ని ఏ కొలమానం కొలవలేదని పెద్దలు చెప్తారు. తమ అభిమాన ఆటగాళ్లు ఎదురైతే పరిగెత్తుకొచ్చి పాదాభివందనం చేసిన ఘటనలు, అటు మైదానంలోనూ అటకు బ్రేక్ వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలను చూస్తుంటాం. అయితే ఇవి కేవలం క్రికెట్ మాత్రమే పరిమితం కాలేదు. ఇలాంటి ఘటన తొలిసారిగా ఓ ఫుట్బాల్ మ్యాచ్ కూడా లో చోటు చేసుకుంది. ముంబై ఫుట్ బాల్ ఎరీనా వేదికగా టీమిండియా, కెన్యా మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఓ అభిమాని మైదానంలోకి వచ్చి కెప్టెన్ సునీల్ ఛేత్రీకి పాదాభివందనం చేశాడు.
ఆ వెంటనే సునీల్ తో కలిసి సెల్ఫీ దిగేందుకు కూడా ప్రయత్నించాడు. కానీ అతని అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించిన కెప్టెన్, తరువాత అతన్ని కలువమని పేర్కొన్నాడు. వెంటనే సదరు అభిమానిని పట్టుకొనేందుకు భద్రతా అధికారులు పరిగెత్తుకు వచ్చారు. కానీ సునీల్ అతన్ని ఏమి అనవద్దని వాళ్లకు సూచించాడు. అంతకుముందు చైనీస్ టైపీతో జరిగిన మ్యాచ్లో భారత జట్టుకు తక్కువ ప్రజాధరణ లభించింది.
కేవలం 2,500 మంది మాత్రమే ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియంకి వచ్చారు. దీంతో అవేదనకి గురైన కెప్టెన్ ఛేత్రీ సోషల్ మీడియా వేదికగా తమ మ్యాచులు వీక్షించాలని అభిమానులను కోరాడు. కనీసం తమని తిట్టడానికైన మైదానానికి రావాలని పేర్కొన్నాడు. సునీల్ అభ్యర్థనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు సునీల్ కు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపారు.
దీంతో నిన్నటి మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోయింది. ప్రేక్షకాధరణనను చూసిన సునీల్ మళ్లీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘దేశం తరఫున ఆడిన ప్రతిసారి అభిమానుల నుంచి ఇదే తరహా మద్దతు దక్కితే మైదానంలో ప్రాణాలు వదలడానికైనా మేము సిద్ధమే. ఈ రోజు రాత్రి ఎంతో ప్రత్యేకం. గ్యాలరీ నుంచి కేకలు వేస్తూ, కేరింతలు కొడుతూ మాకు మద్దతు తెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని ఛెత్రి పేర్కొన్నాడు.
.@chetrisunil11 came up with a double on a special night for the @IndianFootball team skipper, that saw the Blue Tigers run away with the win over Kenya!#BackTheBlue #INDvKEN #Chhetri100 pic.twitter.com/PzXEN1njzE
— Indian Super League (@IndSuperLeague) June 4, 2018
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more