యూఎస ఓపెన గ్రాండ ప్రి గోల్డ్ టోర్నీలో తనదైన అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ టైటిల్ ను సాధించాడు. మరో భారత అగ్రశ్రేణి ఆటగాడు, తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ తో ఫైనల్లో తలపడిన ప్రణయ్.. కశ్యప్ పై పైచేయి సాధించి టైటిల్ ను వశం చేసుకున్నాడు. దీంతో ప్రణయ్ తన కెరీర్ లో మూడో గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్స్ లో ప్రణయ్ 21-15, 20-22, 21-12 తేడాతో కశ్యప్ పై విజయం సాధించాడు.
ఇద్దరు భారత అటగాళ్ల మద్య సుమారు గంటా ఐదు నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచులో ఇద్దరి మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగినా.. చివరకు ప్రణయ్ పై చేయి సాధించాడు. మొదటి గేమ్ను ప్రణయ్ 21-15 తేడాతో గెలుచుకున్నాడు. తర్వాతి గేమ్లో పుంజుకున్న కశ్యప్ విరోచితంగా పోరాడి 22-20తేడాతో గెలిచాడు. నిర్ణయాత్మకమైన మూడో గేమ్లో ప్రణయ్ సునాయసంగా గెలుచుకుని యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్లో కొత్త విజేతగా నిలిచాడు.
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన టోర్నీలో మన దేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఫైనల్కు చేరడం ఇది రెండోసారి. ఇంతకుముందు శ్రీకాంత్, సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ ఫైనల్లో తలపడ్డారు. అనంతరం ప్రణయ్ ట్విటర్ ద్వారా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘యూఎస్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్-2017 టోర్నీ విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు. అకాడమీలో తనతో పాటు శిక్షణ పొందుతోన్న పారుపల్లి కశ్యప్ పై విజయం సాధించానన్నాడు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు ప్రణయ్.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more