బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షెట్లర్ ఆనంద్ పవార్ తుది ఘట్టానిని దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో ఆద్యంత ఆద్భుత ప్రతిభ కనబరిచిన ఆనంద్ పవార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో ప్రపంచ రెండో సీడ్ ఆటగాడు ఇజ్రాయిల్ ఆటగాడు మిషా జిల్బర్ మెన్ ను ప్రపంచ నాల్గవ సీడ్ అనంద్ పవార్ 18-21, 21-14, 21-12తో ఓడించాడు. 69 నిమిషాల పాటు సాగిన పోరులో పవార్ తన మెరుగైన అటతో రాణించాడు.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నాల్గో సీడ్ పవార్ 21-8, 21-10 తేడాతో అన్ సీడెడ్ బీఆర్ సంకీర్త్(కెనడా)పై గెలిచి సెమీస్ కు చేరాడు. 2015లో స్విస్ అంతర్జాతీయ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్ కు చేరిన తరువాత ఆనంద్ పవార్ కు ఇదే తొలి సెమీ ఫైనల్. తొలి రౌండ్లో 21-6, 21-7 తేడాతో బ్రెజిల్ ఆటగాడు మాథ్యూస్ వైగ్ట్ను మట్టికరిపించిన పవార్.. రెండో రౌండ్లో 21-8, 21-8 తేడాతో ఆస్ట్రేలియా ఆటగాడు విల్సన్పై విజయం సాధించాడు.
ఈ ఏడాది ఫైనల్స్ కు చేరడం ద్వారా అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన పవార్.. తన తదుపరి పోరులో మలేసియాకు చెందిన జుల్పాడీ జుల్కీఫీ.. బ్రెజిల్ ఘోర్ సెల్హో డి అలివీరా ల మధ్య జరిగే మ్యాచ్ లో గెలుపోందిన వారితో తలపడనున్నారు. ఇదిలా ఉండగా, మిక్స్డ్ డబుల్స్ లో సిక్కి రెడ్డి- చోప్రా జంట కూడా సెమీస్ కు చేరింది. ఈ జోడి 21-18, 21-11 తేడాతో ఆతిథ్య బ్రెజిల్ జంట మాథ్యూస్ వైగ్ట్- బియానికా ఓలివిరియా లిమాపై గెలిచి సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ జంట తమ ఫైనల్ బెర్తు కోసం జర్మనీ ద్వయం ఫబియన్ హోల్జర్-బార్బరా బెల్లింగ్ బర్గ్లతో తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more