రియో ఒలంపిక్స్ లో పతకాల పట్టికలో ఖాతా ఇంకా తెరవక పోయినప్పటికీ కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైపోతుంది. మొదటిసారి ఒలంపిక్స్ కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తొలిసారి ఆ విభాగంలో ఫైనల్ కు చేరింది. తద్వారా 52 ఏళ్ల జిమ్నాస్టిక్స్ విభాగంలో తొలిసారి ఫైనల్ చేరిన ఇండియన్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
ఆదివారం జరిగిన మహిళ క్వాలిఫయింగ్ రౌండ్, వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఫైనల్లోకి ప్రవేశించి పతకంపై ఆశలు రేపింది. తొలి ప్రయత్నంలోనే 15.100తో దూసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచినా.. రెండో ప్రయత్నంలో 14.600తో అభిమానుల్ని కాస్త కంగారు పెట్టింది. చివరి రౌండ్ లో కెనడా జిమ్నాస్ట్ షాలోన్ ఓల్సేన్ పుంజుకుని 14.950 పాయింట్ల్లు సాధించడంతో దీపా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. నిబంధనల ప్రకారం తొలి ఎనిమిది స్థానాలు సాధించినవారు ఫైనల్ కు అర్హత సాధిస్తారు. ఆ లెక్కన దీప 8వ స్థానంతో ఫైనల్ కి అర్హత సాధించినట్లయ్యింది. ఆల్రౌండ్ విభాగంలో దీప ఓవరాల్గా 51.665 పాయింట్లు స్కోర్ చేసి 27వ స్థానంలో నిలిచింది.
త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీపా కర్మాకర్ ప్రొడునొవాలో ఆరితేరిన జిమ్నాస్ట్. ఆమె కెరీర్ లో మొత్తం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను గెలిస్తే, అందులో 67 గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా అరుదైన రికార్డు సృష్టించిన ఆ ఉత్సహాంతోనే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 5వ స్థానం కైవసం చేసుకుంది. తద్వారా ఒలంపిక్స్ కు ఆ విభాగంలో అర్హత సాధించిన తొలి భారతీయురాలుగా నిలిచింది. ఒలంపిక్స్ కోసం గత మూడు నెలలుగా దీపా రోజుకు ఎనిమిది గంటలకు పైగా కఠోరంగా శ్రమించిందట. నిజానికి ఈ విభాగంలో ఫైనల్ కు వెళ్లటం అంటే మాములు విషయం కాదు.
భారత్కు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 11 మంది మాత్రమే జిమ్నాస్ట్ విభాగంలో ఒలింపిక్స్ బరిలో పోటీ చేశారు. అది కూడా 11 మంది పురుషులు కావడం విశేషం. ఈ విభాగంలో అమెరికా, జపాన్, చైనా లాంటి దేశాలతో గట్టిపోటీ ఉంటుంది. అలాంటిది దీప సాధించిన ఈ విజయం దేశం గర్వించదగ్గదే. ఏది ఏమైనా ఆగస్టు 14న జరగబోయే ఆమె ఫైనల్ పతక వేట కోసం వంద కోట్ల కళ్లు ఎదురు చూస్తుంటాయన్నది మాత్రం అక్షరాల నిజం.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more