తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. స్విమ్మింగ్ క్రీడలో తెలంగాణ బృందం చరిత్ర సృష్టించింది. గ్లెన్ మార్క్ 43వ జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు నాలుగు జాతీయ పతకాలను కైవసం చేసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో నిర్వహించిన ఈ పోటీలలో తొలిసారిగా బాలికల విభాగంలో ఈ ఏడాది పతకం సాధించారు. గత ఏడాది బాలుర విభాగంలో పతకం సాధించిన విషయం తెలిసిందే.
ట్రిణా తనుజ్ 800 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణపతకం, 400 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో రజత పతకం సాధించారు. 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల విభాగంలో గోలి జాహ్నవి కాంస్య పతకాలు వచ్చాయి. జియాన్ స్పోర్ట్జ్ క్లబ్ కోచ్ జాన్ సిద్దిఖీ వద్ద శిక్షణ పొందిన తెలంగాణ బృందంలో జి. చంద్రిక, ఎం. ఇష్వి, దిషా, శ్రీజ, నటాషా, జి.జాహ్నవి, ట్రిణా తనుజ్, సూర్యాన్షు, సాయిరామ్, శివరామ, రుతిక్, సాయినిహార్ తదితరులున్నారు.
ఆటగాళ్ల తాజా ర్యాంకుల వివరాలు:
* రుతిక్ 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో 8వ ర్యాంకు, ఫ్రీ స్టైల్ విభాగంలో 4 వ ర్యాంకు
* సూర్యాన్షు 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో 6వ ర్యాంకు, 100 మీటర్ల బటర్ ఫ్లై స్ట్రోక్ విభాగంలో 8వ ర్యాంకు
* శ్రీజ 100 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 7వ ర్యాంకు, 200 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 5వ ర్యాంకు
* నటాషా 50 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 5వ ర్యాంకు, 100 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 6వ ర్యాంకు, 200 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 6వ ర్యాంకులు సాధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more