హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్’లో భాగంగా బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియాకు మిశ్రమ ఫలితాలు ఎదరయ్యాయి. నిన్నటికినిన్నే చాలాకాలం తర్వాత చైనాఓపెన్ టైటిల్’ను సొంతం చేసుకున్న అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ హాంకాంగ్ టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. మరోవైపు చైనా ఓపెన్ సిరీస్’లో చైనా బ్యాడ్మింటన్ దిగ్గజాన్ని ఓడించి సరికొత్త సంచలనం సృష్టించిన యువకెరటం కిదాంబి శ్రీకాంత్.. అదే దూకుడుతో హాంకాంగ్ టోర్నీలో దూసుకెళ్లాడు. పురుషుల్ సింగిల్స్ లో క్వార్టర్స్’లో శ్రీకాంత్ 21-14, 21-15 స్కోరుతో హాంకాంగ్ కు చెందిన నాన్ వీపై విజయం సాధించాడు. 36 నిముషాలపాటు జరిగిన ఈ మ్యాచులో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచాడు. మొదట్లో శ్రీకాంత్ కు ప్రత్యర్థి నుంచి కాస్త గట్టి పోటీయే ఎదురైంది కానీ.. తర్వాత తన ప్రతిభతో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ సునాయాంగా ఆటను ముగించేశాడు.
మరోవైపు అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాత్రం ఈ హాంకాంగ్ టోర్నీ నుంచి నిష్ర్కమించి.. ఇండియా ఆశల్ని నిరుగార్చేసింది మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనలల్లో మూడో సీన్ సైనా నెహ్వాల్ 15-21, 19-21 స్కోరుతో చైనీస్ తైపీ యింగ్ జు చేతిలో ఘోరంగా పరాజయం పాలయ్యింది. 39 నిముషాలపాటు సాగిన ఈ మ్యాచులో సైనా మొదట్లో ప్రత్యర్థికి గట్టి పోటీయే ఇచ్చినా.. ఓడించలేకపోయింది. దీంతో ఈమె వెనుదిరగాల్సి వచ్చింది. ఇదిలావుండగా.. తన అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న శ్రీకాంత్.. ఈ హాంకాంగ్ టోర్నీ టైటిల్ ను కూడా సొంతం చేసుకుంటాడా..? లేదా..? అని ఆసక్తికరంగా ప్రతిఒక్కరు ఎదురుచూస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more