ఈమధ్య కాలంలో మహిళల క్రీడాకారిణుల మధ్య విభేదాలు ఎక్కువవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు తన సీనియర్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! తనకు, సైనాకు మధ్య అంత ఎక్కువ స్నేహబంధం లేదని, కేవలం హాయ్ - బాయ్ చెప్పుకోవడం వరకే ఒకర్నొకరు పలకరించుకుంటామని తెలిసింది. వీరిద్దరు కలిసి బ్యాడ్మింటన్ ఆడిన సందర్భాలూ ఎక్కువగానే వున్నా.. తమ మధ్య ఎటువంటి బంధం లేదని సింధు సంచలనం రేపింది. అలాగే చెస్ క్రీడాకారిణుల మధ్య కూడా విభేదాలు వున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. చెస్ ఆటలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న ద్రోణవల్లి హారికను జూనియర్ ప్రత్యూష అవమానపరిచిందనే వార్తలు జోరందుకున్నాయి. అయితే వీరిమధ్య విభేదాలున్నది వ్యక్తిగతంగా కాదులెండి... ఆట నేపథ్యంలో ప్రత్యూష అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి, హారికను వెనుక నెట్టేసింది.
ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో తెలుగుతేజం బొడ్డా ప్రత్యూష విజయం సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. బాలికల విభాగంలోని రెండో రౌండ్లో ప్రత్యూష.. సబినా ఇబ్రహియోవా (అజైర్ బైజాన్)ను ఓడించింది. ఈ విజయంతో ప్రత్యూష 2 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ద్రోణవల్లి హారిక పోకర్ చెస్ టోర్నమెంట్లో ఓటమి చవిచూసింది. మొదట్లో అద్భుతంగా ప్రదర్శించి ప్రత్యర్థిని ముచ్చెమటలు పెట్టించిన హారిక... మూడో రౌండ్లో మాత్రం మేరీ అలెస్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఒకవైపు జూనియర్ తెలుగుతేజం విజయం సాధిస్తే.. మరోవైపు సీనియర్ క్రీడాకారిణి అయిన హారిక ఓడిపోవడంతో ఈమెకు అవమానం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలావుండగా... జూనియర్ చెస్ టోర్నమెంట్లో ని పురుషుల విభాగంలో ప్రణీత్ సూర్య రెండో రౌండ్లో.. పోకర్ చెస్ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో అభిజిత్ గుప్తా మూడో రౌండ్లో ఘోరంగా ఓటమి చవిచూశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more