చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఏ స్థాయిలో, ఎక్కడ తలపడినా ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎవరు గెలిచినా సరిహద్దుల్లోని జవాన్లు సంబరాలు జరుపుకుంటారు. అందుకే ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లకు అంత ప్రత్యేకత. ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా అక్టోబరు 24న దుబాయ్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ రికార్డులకెక్కింది. భారత్లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్గా ఇది చరిత్ర సృష్టించింది.
మన దేశంలో స్టార్ ఇండియా నెట్ వర్క్ లో ఏకంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు ఈ మ్యాచ్ ను వీక్షించినట్టు ఐసీసీ తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల గంటలు లైవ్ కవరేజీ చేసినట్టు తెలిపింది. 2016 టీ20 ప్రపంచకప్లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్ను అత్యధికమంది వీక్షించగా ఇప్పుడా రికార్డు బద్దలైంది. ఇదే మ్యాచ్ను ఇంగ్లండ్లో స్కై యూకే నెట్వర్క్ ప్రసారం చేయగా 60 శాతం ఎక్కువ మంది ఈ మ్యాచ్ను వీక్షించారు. పాకిస్థాన్లో పీటీవీ, ఏఆర్వై, టెన్స్పోర్ట్స్లు ప్రసారం చేయగా 7.3 శాతం మంది అధికంగా వీక్షించారు.
ఆస్ట్రేలియాలో అయితే ఫాక్స్ నెట్వర్క్లో ఏకంగా 175 శాతం అధిక వీక్షణలు లభించినట్టు ఐసీసీ వివరించింది. అమెరికాలోనూ ఈ మ్యాచ్కు విశేష ఆదరణ లభించింది. ఈఎస్పీఎన్లో ప్రసారమైన భారత్-పాక్ మ్యాచ్ను గతంలో ఎన్నడూ లేనంతగా చూశారు. ఫేస్బుక్ లోనూ ఈ లీగ్ మ్యాచ్కు రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. 2019 వన్డే ప్రపంచకప్లో 3.6 బిలియన్ వ్యూస్ లభించగా, ఈ మ్యాచ్ ఆ రికార్డును బద్దలు చేస్తూ 4.3 బిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఐసీసీ సామాజిక మాధ్యమాల ద్వారానూ అత్యధికమంది తిలకించారు. 618 మిలియన్ల మంది ఈ మ్యాచ్ను వీక్షించినట్టు ఐసీసీ వివరించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more