టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద ఉన్న రెండు అతిఖరీదైన చేతి గడియారాలను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ రెండు చేతివాచీల ఖరీదు సుమారు రూ.5 కోట్లని వార్తలు వస్తున్నాయి. దుబాయ్ నుంచి తిరిగివస్తున్న హార్దిక్ ను ఆదివారం రాత్రి ముంబై విమానాశ్రయంలో అధికారులు ప్రశ్నించారు. ఆల్ రౌండర్ పాండ్యా వద్ద ఆ విలువైన వాచీలకు చెందిన బిల్లులు లేవని అధికారులు తెలిపారు. టీ20 వరల్డ్ కప్ లో ఆడేందుకు హార్దిక్ పాండ్యా దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్ కు చెందిన పటేక్ ఫిలిప్ కంపెనీ వాచీలను ప్యాండా తనతో తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇక ఈ వాచీల మీద ఉన్న సీరియల్ నెంబర్లు, బిల్లుపై వున్న ఇన్ వాయిస్ నెంబర్ల మధ్య తేడా ఉన్న కారణంగా ఆ వాచీలను సీజ్ చేశారు. ఆ వాచీలు తన వద్ద ముందు నుంచే ఉన్నాయని, అందులో ఒకదాని ఖరీదు 1.4 కోట్లు అని, మరో వాచీ ఖరీదు సుమారు 40 లక్షలు ఉంటుందని హార్దిక్ తెలిపాడు. ఇన్ వాయిస్లో నెంబర్లు తేడా ఉన్నందు వల్ల.. హార్దిక్ మరోసారి సరిచేసిన బిల్లును అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ఖరీదైన వాచీలపై ప్రభుత్వం 38 శాతం పన్ను వసూల్ చేస్తుంది. ఒకవేళ పాండ్యా ఆ విలాసవంతమైన వాచీలకు చెందిన సరైన బిల్లులను సమర్పించలేని పక్షంలో ఆ వాచీలను అధికారులు పూర్తిగా సీజ్ చేయనున్నారు.
సోషల్ మీడియాలో తన వాచీలపై తప్పుడు ప్రచారం జరగడంతో దీనిపై తాజాగా స్పందించిన హార్దిక్ పాండ్యా ఘటనపై క్లారిటీ ఇచ్చాడు. ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల వద్దకు తానే స్వయంగా వెళ్లానని, తాను తీసుకువచ్చిన ఐటమ్స్ గురించి కస్టమ్స్ డ్యూటీ కట్టేందుకు అక్కడకు వెళ్లినట్లు హార్ధిక్ తన ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. చట్టబద్దంగానే దుబాయ్ లో వాచీలు కొన్నానని, వాటికి డ్యూటీ కస్టమ్ కట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు కస్టమ్స్ అధికారులకు కూడా చెప్పానని పాండ్య చెప్పాడు. కస్టమ్స్ అధికారులు తన వద్దనున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారని తెలిపాడు. తాను వాచీ ఖరీదు తెచ్చిన వాచీ ఖరీదు 1.5 కోట్లు మాత్రమే అని హార్థిక్ తెలిపాడు.
— hardik pandya (@hardikpandya7) November 16, 2021
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more