ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బీసిసిఐ ఇప్పటి వరకు కేవలం టీమిండియా ప్లేయర్లకే పెద్దపీట వేస్తుందన్న వార్తలున్నాయి. దీంతో వాటిని బాపుకుంటూ దేశవాళీ క్రికెటర్లకు కూడా బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచుతున్నట్లు బోర్డు కార్యదర్శి జే షా సోమవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. సీనియర్ ప్లేయర్స్కు, అండర్ 23, అండర్ 19 క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను బోర్డు పెంచింది. 40 మ్యాచ్లకుపైగా ఆడిన అనుభవం ఉన్న సీనియర్ దేశవాళీ క్రికెటర్లకు ఇక నుంచి ఒక రోజు మ్యాచ్ ఫీజును రూ.60 వేలకు పెంచినట్లు జే షా చెప్పారు. ఇన్నాళ్లూ వీళ్లు రంజీ ట్రోఫీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటే మ్యాచ్ రోజు రూ.35 వేలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు దానిని రూ.60 వేలకు పెంచారు.
ఇక అండర్ 23 క్రికెటర్లకు రూ.25 వేలు, అండర్ 19 క్రికెటర్లకు రూ.20 వేలు మ్యాచ్ ఫీజుగా ఇవ్వనున్నట్లు జే షా వెల్లడించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే క్రికెటర్లకు రూ.17500 ఇస్తున్నారు. తుది జట్టులో ఆడే ప్లేయర్స్కు ఈ మ్యాచ్ ఫీజు ఇస్తుండగా.. రిజర్వ్ ప్లేయర్స్ ఇందులో సగం మొత్తం అందుకుంటారు. ఇక గతేడాది కరోనా కారణంగా దేశవాళీ సీజన్ నష్టపోవడంతో క్రికెటర్లకు పరిహారం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. 2019-20 సీజన్ ఆడిన క్రికెటర్లకు 2020-21 సీజన్లో 50 శాతం అదనంగా చెల్లించనున్నట్లు కూడా జే షా ప్రకటించారు.
I am pleased to announce the hike in match fee for domestic cricketers.
— Jay Shah (@JayShah) September 20, 2021
Seniors – INR 60,000 (above 40 matches).
Under 23- INR 25,000
Under 19 – INR 20,000#BCCIApexCouncil
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more