ఇంగ్లాండ్ తో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచులో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. సుమారుగా 50 ఏళ్లుగా ఈ మైదానంలో విజయం కోసం అర్రులు చాచిన టీమిండియాకు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఘనవిజయాన్ని సోంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ఈ విజయంపై భారత ప్రముఖులతో పాటు ప్రపంచ ప్రముఖులు కూడా విరాట్ సేనకు అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2021-23 జాబితాలోనూ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి చూసుకుంటే భారత్ రెండు విజయాలు.. ఒక ఓటమి.. ఒక డ్రాతో మొత్తంగా 54.17 శాతం పర్సంటైల్తో 26 పాయింట్లు సాధించింది. ఇక రెండో స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాక్ జట్టు విండీస్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రాగా ముగించింది. ఓవరాల్గా ఒక గెలుపు, ఒక ఓటమితో 50 శాతం పర్సంటైల్తో 12 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్ 50 శాతం పర్సంటైల్తో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.
ఇక పాయింట్ల పరంగా ఇంగ్లండ్ విండీస్, పాక్ల కంటే ఎక్కవగా ఉన్నప్పటికీ.. టీమిండియాతో సిరీస్లో రెండు ఓటములు ఉండడంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా ఒక గెలుపు, రెండు ఓటములు, ఒక డ్రాతో 29.17 శాతం పర్సంటైల్తో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక నాలుగో టెస్టులో 157 పరుగులతో అద్భుత విజయంతో 50 ఏళ్ల తర్వాత ఓవల్ మైదానంలో విజయాన్ని అందుకుంది. 1971లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో విజయాన్ని అందుకున్న టీమిండియా.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కోహ్లి నాయకత్వంలో ఓవల్ మైదానంలో విజయాన్ని సాధించింది. ఇక చివరిదైన ఐదో టెస్టు సెప్టెంబర్ 10 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more