తన జట్టును ఓటమి నుంచి కాపాడేందుకు ఓ బ్యాట్స్ మెన్ ఎం చేయగలడో అదే టీమిండియా అల్ రౌండర్ హార్థిక్ పాండ్య చేశాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కొనియాడాడు. భారత జట్టుకు నైపుణ్యం గల బ్యాట్స్ మెన్ కన్నా.. ఆ కీలక సమయంలో ఫాండ్యా లాంటి ఆటగాడు అత్యంత అవసరమన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో కొద్దిపాటి పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడని చెప్పిన చోప్రా.. పాండ్య సాధించిన కీలకమైన 90 పరుగులు జట్టుకు ఘోర ఓటమి నుంచి తప్పించాయని అన్నారు.
ఫాండ్యా మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నంత సేపు భారత శిబిరంలో ఆశలు నిలిపాడని ఆకాశ్ పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడిన చోప్రా ఈ మ్యాచ్ పై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా పాండ్య ఆటను పొగడ్తలతో ముంచెత్తాడు. టీమీండియా పూర్తిస్థాయిగా పాండ్య అవతరిస్తున్నాడని, ఇలానే మున్ముందు కూడా రాణిస్తే జట్టులో అతని స్థానం కూడా మరింత ముందుకు పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అటు బంతితో రాణిస్తున్న ఈ అల్ రౌండర్.. బ్యాట్ తో కూడా బాగా రాణిస్తే అతడు ఆడుతున్న ఆరో స్థానం నుంచి అతడ్ని నాలుగైదు స్థానాలకు కూడా జట్టు యాజమాన్యం మార్చవచ్చునని అన్నాడు.
అవకాశాల కోసం వేచి చూడకుండా వచ్చిన దానినే సద్వినియోగం చేసుకున్న పాండ్యా.. షార్ట్ పిచ్ బంతులను దీటుగా ఎదుర్కొన్నాడని అన్నాడు. స్పిన్నర్లను కూడా ఉతికారేశాడని ప్రశంసించాడు, ధావన్ తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా అతడే 75 పరుగులు చేశాడు. పాండ్య అద్భతమైన ఆటతో ఆకట్టుకున్నాడన్నాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 374/6 భారీ స్కోర్ సాధించిన సంగతి తెలిసిందే. ఆరోన్ ఫించ్(114), స్టీవ్స్మిత్(105) శతకాలతో మెరవగా భారత బ్యాట్స్మెన్ తేలిపోయారు. పాండ్య(90), ధావన్(74) అర్ధ శతకాలు సాధించారు.
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more