సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసిన తరుణంలోనే మరో పరాభవం కూడా ఎదురైంది, టీమిండియా ఆటతీరు ఆలస్యంగా సాగిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారత జట్టుకు జరిమానా విధించింది. స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకి ఐసీసీ జరిమానా విధించింది. అయితే మరింతగా పరిస్థితులు మారకుండా, వుండేందుకు భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ ఐసీసీకి క్షమాపణలు చెప్పాడు, బౌలింగ్ చేసే సమయంలో టీమిండియా ఏకంగా నాలుగు గంటల ఆరు నిమిషాల సమయాన్ని తీసుకుంది.
దీంతో ఇంతగా నిదానించిన ఓవర్ రేట్ కు ఫలితంగా జరిమానాను కట్టనుంది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు రాడ్ టకర్, సామ్, టీవీ అంపైర్ పాల్ రీఫెల్, ఫోర్త్ అంపైర్ గెరార్డ్ అబూద్ ఫిర్యాదు మేరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఐసీసీ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దేశించిన సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పొరపాటుని అంగీకరించడంతో దీనిపై విచారణ అవసరం లేదు’’ అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది.
మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ కూడా మైదానంలో ఆట ఆలస్యంగా సాగిందని అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి ఇన్నింగ్స్ లో మొదట కొంత మంది ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. దీనికి కొంత సమయం పట్టింది. నిర్దేశించిన సమయం కంటే భారత్ 45 నిమిషాలు ఎక్కువగా తీసుకుందనిపించింది’’ అని స్మిత్ అన్నాడు. కాగా, సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇదే మైదానంలో రెండో వన్డే ఆదివారం జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more