క్రికెట్ ప్రపంచాన్ని ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజల అభిమాన క్రీడా క్రికెట్ ను ఫిక్సింగ్ మాఫియా తమ కబంధ హస్తాలలోకి తీసుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. అంతర్జాతీయ క్రికెట్ అడుతున్న క్రీడాకారుల నుంచి దేశీయ క్రికెట్ అడే క్రీడాకారుల వరకు అందరినీ తన ప్రభావానికి గురిచేస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ భూతం చివరాఖరున వారిని కూడా బలిపశువుల్ని చేస్తోంది. కొందరు ఆటగాళ్లను వారి బారిన పడగానే పట్టుకునే నిఘా కళ్లు.. కొందరిని మాత్రం ఫిక్సింగ్ అరోపణలు వచ్చిన తరువాత విచారణ చేస్తోంది.
అయితే తాజాగా శ్రీలంక క్రికెట్లో ముగ్గురు ఆటగాళ్లు దాని ప్రభావానికి పడి నెలలు గడిచిన తరువాత నిఘాకళ్లు తెరుచుకున్నాయి. దీంతో విచారన పర్వం సాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంకకు చెందిన ముగ్గురు క్రికెటర్లపై తమ అవినీతి నిరోధక బృందంతో విచారణ సాగిస్తోంది. అయితే ఈ ముగ్గురు క్రీడాకారులు ఎవరన్న వివరాలను తెలిపేందుకు నిరాకరించిన ఐసీసీ.. విచారణ పూర్తైన తరువాత క్రీడాకారుల పేర్లను వెలువరిస్తామని చెప్పింది. ఇక ప్రస్తుతం తమ జట్టులో కొనసాగుతున్న వారెవరూ ఈ జాబితాలో లేరని పేర్కోంది.
ఈ విషయంలో లంక క్రీడల మంత్రి దుల్లాస్ అలహపెరుమ స్పందిస్తూ, తమ దేశానికి అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు క్రీడాకారులపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయని.. వారిపై ఐసీసీ విచారణ కూడా కోనసాగుతుందని చెప్పారు. దీనిపై శ్రీలంక బోర్డు వివరణ ఇస్తూ, ఆ ముగ్గురిలో ప్రస్తుత జాతీయ జట్టుకు ఆడుతున్న వారెవరూ లేరని, విచారణ ఎదుర్కొంటున్నది మాజీ ఆటగాళ్లని స్పష్టం చేసింది. కాగా, ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరన్నది లంక క్రీడల మంత్రి వెల్లడించలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more