ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన తొలిజట్టుగా నిలిచింది. మహిళల ప్రపంచకప్ లో తన జైత్రయాత్ర కొనసాగిస్తూ మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన మరో అద్భుత, ఉత్కంఠ పోరులో హర్మన్ ప్రీత్ సేన 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ కు చేరడం ఖాయమైంది. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రబాగన నిలిచిన మరో రెండు జట్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడాల్సి ఉంది. వీటిలో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు కూడీ సెమిస్ కు చేరనుంది.
ఇదిలా ఉండగా, 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. చివర్లో అమెలియా కెర్ర్(19 బంతుల్లో 34) ధాటిగా ఆడినా కివీస్కు ఓటమి తప్పలేదు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆ జట్టును.. మ్యాడీ గ్రీన్( 23 బంతుల్లో 24), క్యాటీ మార్టిన్(; 28 బంతుల్లో 25) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 43 పరుగులు జోడించాక.. స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. చివరి రెండు ఓవర్లలో అమెలియా కెర్ర్, హయ్లీ జెన్సన్ ధాటిగా ఆడి భారత్ను కంగారు పెట్టించారు. కివీస్కు ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా శిఖా పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి గెలపించింది.
అంతకుముందు టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. షెఫాలీవర్మ(46; 34 బంతుల్లో 4x4, 3x6) ధాటిగా ఆడగా, తానియా భాటియా(23; 25 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించింది. కివీస్ బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బంతులేయడంతో ఓపెనర్ స్మృతి మంధాన(11), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(1), జెమిమా రోడ్రిగ్స్(10), దీప్తి శర్మ(8), వేదా కృష్ణమూర్తి(6) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో శిఖాపాండే(10), రాధా యాదవ్(14) నిలవడంతో న్యూజిలాండ్ ముందు 134 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోజ్మేరీ (2), అమెలియా కెర్ర్(2), తాహుహు(1), సోఫీ డివైన్(1), కాస్పెరిక్(1) వికెట్లు తీశారు. భారత బౌలర్లలో దీప్తిశర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more