భారత్, వెస్టిండీస్ మధ్య డిసెంబరు 6 నుంచి ప్రారంభంకానున్న సిరీస్లో నోబాల్ని గుర్తించేందుకు ప్రయోగాత్మకంగా టీవీ అంపైర్ని ఐసీసీ నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్లు దాదాపు 21 నోబాల్స్ విసిరినా.. ఫీల్డ్ అంపైర్లు పసిగట్టలేకపోవడంపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో.. నోబాల్స్ని గురించేందుకు ఒక టీవీ అంపైర్ని నియమించాలనే ప్రతిపాదనని మళ్లీ ఐసీసీ తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఆరంభం నుంచి ఫీల్డ్ అంపైర్ల తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 2019 సీజన్ సమయంలో నోబాల్స్ని గుర్తించడంలో అంపైర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో.. ముంబయితో జరిగిన ఓ మ్యాచ్లో బెంగళూరు మ్యాచ్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. మరో మ్యాచ్లో ధోనీ ఏకంగా మైదానంలోకి వెళ్లి ఫీల్డ్ అంపైర్లతో గొడవకి దిగాడు. మొత్తంగా చూసుకుంటే ఇటీవల నోబాల్స్ని గుర్తించడంలో ఫీల్డ్ అంపైర్లు విఫలమవుతున్నారనేది నిజం. దీంతో.. ఐసీసీ దిద్దుబాటు చర్యలకి దిగింది.
ఫీల్డ్ అంపైర్లతో సంబంధం లేకుండా.. ఒక టీవీ అంపైర్ స్టేడియంలో ఉంటాడు. అతడి పని కేవలం నోబాల్స్ని గుర్తించడమే. ఇప్పటి వరకూ ఔట్ నిర్ణయం విషయంలో ఏవైనా సందేహాలుంటే మైదానంలోని ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు.. స్టేడియంలోని థర్డ్ అంపైర్కి నివేదించేవారు. ఇక ఫోర్త్ అంపైర్ మైదానం వెలుపల నుంచి మ్యాచ్ని పర్యవేక్షించేవాడు. అతని విధి.. కొత్త బంతుల్ని, వాటర్ బాటిల్స్ని ఫీల్డ్ అంపైర్లకి అందించడం. తాజాగా టీవీ అంపైర్ కూడా వారితో చేరనున్నాడు. దీంతో.. మొత్తంగా ఐదుగురు అంపైర్లు మ్యాచ్ని పర్యవేక్షించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more