అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు టాప్ ప్లేస్ ను ఆక్రమించుకున్నారు. ఇవాళ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాలలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ లో 895 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలువగా, ఆ తరువాత రెండో స్థానంలో వైస్ కెప్టెన్, భారత ఓపెనర్ రోహిత్ శర్మ (863) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇటు బౌలింగ్ విభాగంలోనూ భారత జట్టు అటగాడు టాప్ లో నిలిచాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (797) మినహా ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 740 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండ్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు హార్దిక్ పాండ్య పదో స్థానంలో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ (122) రెండో స్థానంలో కొనసాగుతోంది.
ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్ (125) అగ్రస్థానంలో నిలిచింది. సుదీర్ఘ ఫార్మాట్లో మొదటి స్థానంలో ఉన్న భారత్ టీ20ల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్×బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు నవంబర్ 14న ప్రారంభం కానుంది. ఇటీవల బంగ్లాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ను రోహిత్ సేన 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక టెస్టు క్రికెట్ లోనూ బంగ్లాపై తమ అధిపత్యాన్ని కనబర్చాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతొంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more