ఐసీసీ టీ 20 ప్రపంచకప్ కొత్త ఫార్మాట్లో జరగనుంది. మొత్తం 16 దేశాలు పోటీపడనున్న ఈ మెగా టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మరోవైపు ఈ టోర్నీలో ప్రవేశించడానికి అర్హత పొందిన చిన్న జట్లు పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ జట్లు తొలుత సూపర్-12 దశకు తమలో తాము రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. ఈ రెండు గ్రూపుల్లో రెండు పెద్ద జట్లను ఐసీసీ తన షెడ్యూల్ లో చేర్చింది.
* గ్రూప్‘ఎ’లో శ్రీలంక, న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్
*గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్. ఈ రెండు గ్రూపుల్లో అగ్ర స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్-12 కు చేరుతాయి.
* గ్రూప్ ‘ఎ’ లో అగ్ర స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన జట్టు సూపర్ -12 దశలో గ్రూప్- 1 లో చేరతాయి. ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఉన్నాయి.
* ఇక, గ్రూప్ ‘బి’ లో తొలిజట్టు, గ్రూప్ ‘ఎ’ లో రెండో స్థానంలో ఉన్న జట్టు సూపర్ -12 దశలో గ్రూప్-2 లో జట్లతో తలపడతాయి. ఈ గ్రూప్ లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి.
* ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అక్టోబర్ 18న గీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో శ్రీలంక, ఐర్లాండ్ మధ్య జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ మెల్ బోర్న్ లోని ఎంసీజీ మైదానంలో జరుగనుంది.
సూపర్-12 దశలో భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు
భారత్ x దక్షిణాఫ్రికా, అక్టోబర్ 24న వేదిక పెర్త్, పెర్త్ స్టేడియం సా. 4.30గం. నుంచి ప్రారంభం
భారత్ x క్వాలిఫయర్, అక్టోబర్ 29న, వేదిక మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ. 1.30గం. నుంచి ప్రారంభం
భారత్ x ఇంగ్లాండ్, నవంబర్ 1, వేదిక మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ.1.30 గం. నుంచి ప్రారంభం
భారత్ x క్వాలిఫయర్, నవంబర్ 5, వేదిక అడిలైడ్, అడిలైడ్ ఒవల్ మైదానం, మ.2 గం. నుంచి ప్రారంభం
భారత్ x అఫ్గానిస్థాన్, నవంబర్ 8, వేదిక సిడ్నీ, సిడ్ని క్రికెట్ మైదానం, మ.1.30 గం. నుంచి ప్రారంభం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more