కొలంబో వేదికగా ఇంగ్లాండ్ తో ముగిసిన మూడో టెస్టు మ్యాచులో శ్రీలంక స్పిన్నర్ లక్షణ్ సందకన్ బౌలింగ్ చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచులో 42 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ జట్టు మూడు టెస్టుల సిరీస్ని 3-0తో చేజిక్కించుకోగా.. ఆతిథ్య శ్రీలంక నోబాల్స్ కారణంగా అభాసుపాలైంది.
ఆటలో నాలుగో రోజైన సోమవారం తొలి సెషన్లో ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన సందకన్.. ఏకంగా 12 బంతుల్ని నోబాల్గా విసిరాడు.
అయితే.. ఇందులో కేవలం రెండు బంతుల్ని మాత్రమే అంపైర్లు నోబాల్గా గుర్తించారు. ఈ రెండు బంతుల్లోనూ ఒక బంతికి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ ఔటయ్యాడు. సందకన్ బౌలింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన శ్రీలంక కెప్టెన్ లక్ష్మల్.. అతనితో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. మొత్తంగా ఇవాళ్టి తొలి సెషన్లో సందకన్ వేసిన ఐదు ఓవర్లని పరిశీలించిన ‘మ్యాచ్ ప్రసార ఛానల్’ 40% బంతులు నోబాల్స్ అని గుర్తించింది.
మొత్తంగా ఆయన వేసిన ఐదు ఓవర్లలో.. 12 బంతుల్ని అతను నోబాల్ గా వేసినట్లుగా వెలుగులోకి తెచ్చింది. ఇందులో రెండు బంతులు అంటే.. 6% మాత్రమే అంపైర్లు గుర్తించగలిగారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ నోబాల్స్పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొలంబో వేదికగా శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బెయిర్స్టో (110: 186 బంతుల్లో 9x4, 1x6) శతకం బాదడంతో తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులు చేసింది.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టు 240 పరుగులకే కుప్పకూలిపోగా.. ఇంగ్లాండ్కి 96 పరుగుల తొలి ఇన్నింగ్స్ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 230 పరుగులకి ఆలౌటవగా.. శ్రీలంక ముందు 327 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే.. ఈ భారీ లక్ష్య ఛేదనని 82/5తో పేలవ రీతిలో ఆరంభించిన లంక.. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేకపోయింది. ఆఖరికి ఆ జట్టు 284 పరుగులకి ఆలౌటైంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more