We wanted to be ruthless, says Rohit విండీస్ పై మా వ్యూహం ఫలించింది: రోహిత్

We wanted to be ruthless skipper rohit sharma

Team India, West Indies, Shikhar Dhawan, Rohit Sharma, Rishabh Pant, india vs west indies 3rd t20i, India, IND vs WI 3rd T20, cricket, cricket news, sports news, latest sports news, sports

Skipper Rohit Sharma lauded India for completing a 3-0 clean sweep, saying he wanted his team to be ruthless in the third match against West Indies

విండీస్ పై మా వ్యూహం ఫలించింది: రోహిత్

Posted: 11/12/2018 04:41 PM IST
We wanted to be ruthless skipper rohit sharma

చెన్నై వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ముప్పేటదాడి చేయాలని టీమిండియా ముందే నిర్ణయించుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 181 పరుగులు చేయగా.. ఛేదనలో శిఖర్ ధావన్ (92: 62 బంతుల్లో 10x4, 2x6), రిషబ్ పంత్ (58: 38 బంతుల్లో 5x4, 3x6) మెరుపులు మెరిపించడంతో ఆఖరి బంతికి గెలుపొందిన భారత్ జట్టు.. మూడు టీ20ల ఈ సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కంటే ముందే సిరీస్ చేజిక్కించడంతో.. విండీస్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడాలని తాము ముందే అనుకున్నట్లు రోహిత్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌లో భారత్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 5 పరుగులు అవసరమగా.. మొదటి 3 బంతుల్లోనే 4 పరుగులు రావడంతో స్కోరు సమమైంది. ఈ దశలో భారత్ విజయంపై ఎవరికీ సందేహాల్లేవు. కానీ.. నాలుగో బంతిని వేస్ట్ చేసిన ధావన్.. ఐదో బంతికి ఔటవడంతో ఆఖరి బంతికి ఒక పరుగు అవసరమైంది. అయితే.. చివరి బంతిని తెలివిగా ఆడిన మనీశ్ పాండే సింగిల్ తీయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

‘ఐపీఎల్‌లో ఆఖరి బంతికి ముగిసే మ్యాచ్‌లు ముంబయి ఇండియన్స్‌‌కి ఆడిన నాకు స్వీయానుభవమే. అయితే.. ఒత్తిడిలో ఆ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేయడం మాత్రం గొప్ప ప్రదర్శన. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందే.. వెస్టిండీస్‌ టీమ్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడాలని మేము నిర్ణయించుకున్నాం. ఇలా ఒత్తిడిలో ముగిసే మ్యాచ్‌ల నుంచి యువ క్రికెటర్లు చాలా అంశాలు నేర్చుకుంటారు’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles