వెస్టిండీస్తో వన్డే సిరీస్లో అదరగొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లోనూ మళ్లీ కింగ్ గా నిలిచాడు వన్డే క్రికెట్కు సంబంధించి ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో బ్యాట్స్మెన్ జాబితాలో కోహ్లీ(899 పాయింట్లతో) తన అగ్రస్థానంలోనే కొనసాగుతూ సత్తాచాటాడు. కోహ్లీ ఈ ఏడాది 14వన్డే మ్యాచులాడి మొత్తం 1202పరుగులు సాధించాడు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్లో మూడు శతకాలతో మొత్తం 453పరుగులు సాధించాడు.
మరోవైపు ఇదే విండీస్ సిరీస్లో రెండు శతకాలతో దూకుడు కొనసాగించిన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(871పాయింట్లతో) కూడా తాజా ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ ఉన్నాడు. టెస్టుల్లోనూ కోహ్లీనే అగ్రస్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సిరీస్లో నామమాత్ర ప్రదర్శన చేసిన భారత ఓపెనర్ శిఖర్ ధావన్(767పాయింట్లతో) మాత్రం నాలుగు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు 24స్థానాలు మెరుగుపరుచుకొని కెరీర్లో తొలిసారిగా 48 ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
బౌలర్ల విషయానికొస్తే పేసర్ జస్ప్రీత్ బుమ్రా(841పాయింట్లతో) తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో అఫ్గానిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్(788పాయింట్లు), మూడో స్థానంలో కుల్దీప్ యాదవ్(723పాయింట్లు) కొనసాగుతున్నారు. అయితే మరో భారత స్పిన్నర్ చాహల్(683), ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్(683)తో కలిసి సమానంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్లో మాత్రం వన్డే క్రికెట్లో ఇంగ్లాండ్(126పాయింట్లతో) మొదటి స్థానంలో ఉండగా, భారత్(121) రెండో స్థానంలో ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more