అప్ఘనిస్తాన్ తో టీమిండియా జూన్ 14 నుంచి 18 వరకు అడనున్న టెస్టు మ్యాచుకు ఇవాళ బిసిసిఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. దీంతో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న జట్టును, ఐర్లాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ లలో కూడా పాలుపంచుకోనున్న జట్టును ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల భారత బృందానికి అజింక్య రహానె కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టెస్టు నుంచి రెస్టు కల్పించింది బిసిసిఐ. ఇక అదే సమయంలో రహానేకు పరిమిత ఓవర్ల మ్యాచులలో అడేందుకు మాత్రం ఎంపిక చేయలేదు.
ఒకే మ్యాచులో మూడు టన్నులను బారిన కరుణ్ నాయర్ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అఫ్గానిస్థాన్తో జరిగే ఏకైక చారిత్రక టెస్టుకు విరాట్ కోహ్లీ స్థానంలో నాయర్ ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ముంబయి ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. సర్రే తరఫున ఇంగ్లాండ్ల కౌంటీ క్రికెట్ ఆడనున్న విరాట్ ఐర్లాండ్తో టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు అంబటి రాయుడికి ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు అవకాశం ఇచ్చారు. ఐర్లాండ్ టీ20 సిరీస్లో సిద్ధార్థ్ కౌల్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.
అఫ్గాన్ టెస్ట్కు భారత జట్టు: అజింక్య రహానె (సారథి), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్.
ఐర్లాండ్తో 2 టీ20లకు భారత జట్టు: విరాట్ కోహ్లీ (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుదర్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ్ ఔల్, ఉమేశ్ యాదవ్
ఇంగ్లాండ్తో 3 టీ20లకు భారత జట్టు: విరాట్ కోహ్లీ (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుదర్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ్ ఔల్, ఉమేశ్ యాదవ్
ఇంగ్లాండ్తో 3 వన్డేలకు భారత జట్టు: విరాట్ కోహ్లీ (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుదర్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ్ ఔల్, ఉమేశ్ యాదవ్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more