సౌతాఫ్రికాతో లాస్ట్ టెస్ట్ కు టీమిండియా రెడీ అయింది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న సౌతాఫ్రికా.. ఈ మ్యాచ్ లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు చివరి టెస్ట్ గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది కోహ్లీ సేన. బుధవారం (జనవరి-24) జోహాన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న మూడో టెస్టు కోసం రెండు జట్లు సమాయత్తం అవుతున్నాయి. సౌతాఫ్రికాతో మరో ఫైట్ కు రెడీ అయ్యింది టీమిండియా. మూడు టెస్టుల్లో భాగంగా బుధవారం నుంచి చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ ను దక్కించుకున్న సౌతాఫ్రికా.. లాస్ట్ టెస్టులోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.
మరోవైపు వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడిన టీమిండియా చివరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకొనే ప్రయత్నంలో ఉంది. జొహన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగే చివరి టెస్టు కోసం.. రెండు జట్లు రెడీ అయ్యాయి. మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. మరోవైపు రెండు టెస్టుల్లోనూ చోటు దక్కని రహానే.. మూడో టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్లలో రహానే ఎక్కువ టైం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయటంతో చివరి టెస్ట్ లో చోటు దక్కడం ఖాయమనిపిస్తోంది.
చివరి టెస్ట్ కు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడటం అనుమానంగానే ఉంది. నెట్ ప్రాక్టీస్ లో ఇషాంత్ శర్మ వేసిన బంతి మోకాలికి తగలడంతో రాహుల్ గాయపడ్డాడు. మూడో టెస్టుకు రాహుల్ పూర్తిగా కోలుకోకపోతే.. అతని స్థానంలో మురళీ విజయ్ తో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశముంది. లాస్ట్ టెస్ట్ కు సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ బావుమా దూరమయ్యాడు. ఉంగరం వేలికి గాయం కావటంతో నాలుగు వారాలు రెస్ట్ అవసరమని టీమ్ ఫిజియో చెప్పారు. బావుమా ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలో దక్షిణాఫ్రికా ఇంకా తేల్చుకోలేదు. అయితే ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ను తుది జట్టులోకి తీసుకొని ఒక బౌలర్ ను తప్పించాలని సౌతాఫ్రికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
WHACK! Out of the ground this one from @ImRo45 #TeamIndia #SAvIND pic.twitter.com/Bk3euApHG9
— BCCI (@BCCI) January 22, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more