టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోమారు తన నంబర్ వన్ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ను వెనక్కినెట్టి కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-1తో దక్కించుకోవడం.. మూడు వన్డేలలో రెండు శతకాలతో మొత్తం 263 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆయనకు తిరిగి తన అగ్రస్థానం దక్కింది. భారత బౌలర్ బుమ్రా కూడా తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు.
బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ(889) తన కెరీర్లోనే అత్యుత్తమ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కోహ్లీ మరోవైపు టీమిండియా తరపున అత్యధిక పాయింట్లు సచిన్ టెండుల్కర్ పాయింట్లను అధిగమించాడు. ఈ ఫీటు సచిన్ 1998లో సాధించాడు. ఇక కోహ్లీ తరువాతి స్థానాల్లో.. డివిలియర్స్(872), డేవిడ్ వార్నర్(865) లు వున్నారు.
బౌలర్ల జాబితాలో బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్లోనే అత్యుత్తమంగా మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అక్షర్ పటేల్(8), భువనేశ్వర్ కుమార్(15) మాత్రమే టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. జట్టు ర్యాంకింగ్స్లో మాత్రం టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా అగ్రస్థానంలో వుంది.
ఇక ఐసీసీ వన్డే బ్యాట్స్ వుమన్ ర్యాంకింగ్స్ లో టీమిండియా మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీరాజ్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానం నుంచి నంబర్ వన్ కు చేరుకుంది. ఆమె ఖాతాలో 753 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాత ఆమె ఒక్క మ్యాచ్ సైతం ఆడకపోవడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాట్స్ వుమన్ ఎలీస్ పెర్రీ (725), దక్షిణాఫ్రికా అమ్మాయి అమీ శాటర్త్ వైట్ (720) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో టీమిండియా సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి రెండో స్థానంలో నిలువగా, దక్షిణాఫ్రికా బౌలర్ మారిజానె క్యాప్ (656) అగ్రస్థానంలో ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more