టీమిండియాతో అటు టెస్టు, ఇటు వన్డే సిరీస్ లలో ఘోరంగా పరాజయం పాలై.. ఇక త్వరలో టీ20 సిరీస్ లో తలపడనున్న నేపథ్యంలో అసీస్ జట్టలో మనోధైర్యాన్ని నింపేందుకు రంగంలోకి దిగారు అసీస్ మాజీ క్రికెటర్లు. టీ20 క్రికెట్ లో తమ జట్టు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టులోని నలుగురైదుగురు అటగాళ్లకు ఐఫీఎల్ అడిన అనుభవం వుందని, దాంతోనే వారు టీమిండియాపై జయకేతనం ఎగురవేస్తారని ఆసీస్ మాజీ సారథి మైకెల్ కాస్ప్రొవిజ్ అభిప్రాయాపడ్డారు.
ఇలా ఓ వైపు తమ జట్టులో మనోధైర్యాన్ని నింపుతూనే మరో వైపు టీమిండియాపై మైండ్ గేమ్ కు తన వంతు పాత్ర పోషించాడు కాస్ప్రోవిజ్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెంద్కులర్తో టీమిండియా సారథి కోహ్లీకి పోలిక ఏంటి అని ప్రశ్నించాడు. ఎప్పటికీ సచిన్ టెండుల్కర్ ఒక్కడే అని.. అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆయన అన్నాడు. సచిన్ భారత్కు ఎన్నో విజయాలు అందించాడు. కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. అలాంటి సచిన్తో కోహ్లీని పోల్చడం సరికాదని మైకెల్ తెలిపారు.
రెండు దశాబ్దాల క్రితం షార్జాలో ఆసీస్-భారత్ మధ్య జరిగన మ్యాచ్ లోని ఘటనలు గుర్తు చేసుకుని అప్పటి సచిన్ స్థానంలో విరాట్ వుంటే విజయం సాద్యమయ్యేదా అని ప్రశ్నించారు. ఎప్పటికీ సచిన్ టెండుల్కర్ ఒక్కడేనని ఉద్ఘాటించారు. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. కోహ్లీ సారథిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదని అంటూనే టీ20 సిరీస్ లో తమ జట్టు రాణిస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. తమ జట్టులోని స్మిత్, వార్నర్, మ్యాక్స్వెల్, అరోన్ ఫించ్కి ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉందని.. జట్టు విజయానికి ఇదే కలసివస్తుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more