క్రికెట్ లో నిబంధనలను మరింత కఠినం చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ దిగ్గజాల నుంచి నిరసనలు, అసంతృప్తులు వ్యక్తం అవుతూనే వున్నాయి. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా మంజ్రేకర్ పలు పోస్టులు పెడుతూ, ఫేక్ ఫీల్డింగ్ నిబంధనను మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశాడు. ఇది తప్పుదారి పట్టించడం కాదని, బ్యాట్స్ మెన్లకు మోసం చేయడం కాదని, ఇది పూర్తిగా ఓ ట్రిక్ కింద పరిగణించాలని కోరాడు.
ఇంతలా సంజయ్ మంజ్రేకర్ రియాక్ట్ అవ్వడానికి కారణం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనినే. ఎందుకంటే కొత్తగా అమల్లోకి వచ్చిన నూరు నిబంధనల్లో ఫేక్ ఫీల్డింగ్ నిబంధన కింద కీపింగ్ కూడా వస్తుంది. దీంతో తన చేతిలో బంతి లేకున్నా ధోని చేతులు అలవాటులో పోరబాటుగా వికెట్ల వైపుకు వెళ్తే.. దానిని ఫేక్ ఫీల్డింగ్ గా పరిగణించి అయనపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా..? త్వరలోనే అంటే అసీస్ తో జరుగుతున్న టీ20లో భాగంగా ఇది జరుగుతుందా..? అంటే అవుననే అంటున్నారు క్రీడీ పవడితులు.
సాధారణంగా కీపింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న వేళ, దూరం నుంచి వచ్చే బంతిని ధోనీ, తన చేతులతో అడ్డుకుని, వికెట్లపైకి నెడతాడన్న సంగతి తెలిసిందే. బంతిని క్యాచ్ పట్టుకుని, వికెట్లను గిరాటు వేయకుండా, బంతి దారిని వికెట్లపైకి మళ్లించడంలో ధోనీ ఎంత దిట్టో తెలిసిందే. కొత్త నిబంధనల ప్రకారం, ధోనీ ఏ మాత్రం బంతిని అందుకోవడంలో విఫలమై, ఖాళీ చేతులను వికెట్ల వైపు చూపినా ఫేక్ ఫీల్డింగ్ కిందకే వస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంజ్రేకర్ బౌలర్లను తప్పదారి పట్టించి ఒక వైపు బంతిని మళ్లించేందుకు ప్రయత్నించి మరోవైపుకు కొట్టే బ్యాట్స్ మెన్లపై చర్యలేమి అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more