టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించనుందా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. తాజాగా కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు మహేంద్రుడి పేరును బీసీసీఐ సిఫారసు చేసింది. జనవరి 26న దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు విభాగాల్లో రాణించిన ప్రముఖులకు కేంద్రం పురస్కరాలను అందించనుంది. ఈ క్రమంలో ఇప్పటికీ రాజీవ్ ఖేల్ రత్నా, ప్రద్మశ్రీ పురస్కారాలను అందుకున్న ధోనికి మరో పురస్కారం కూడా అందించాలని కొరుతూ బిసిసిఐ క్రీడామంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది.
భారత క్రికెట్కు అతడు అందించిన సేవలకు గుర్తింపుగా దేశంలో మూడో అత్యున్నత పురస్కారానికి ‘మిస్టర్ కూల్’ పేరును ప్రతిపాదించింది. పద్మ అవార్డులకు ఈ ఏడాది ధోని పేరు మాత్రమే సిఫారసు చేసినట్టు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అత్యంత విజయవంతమైన కెప్టెన్గా గుర్తింపు పొందిన ధోని పేరును ఏకగ్రీవంగా బోర్డు సభ్యులు నామినేట్ చేశారని తెలిపారు. ఈ మేరకు బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలిపారు.
మన దేశానికి చెందిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు. వన్డేల్లో దాదాపు 10 వేల పరుగులు చేశాడు. 90 టెస్టు మ్యాచులు ఆడాడు. కెప్టెన్గా టీమిండియాకు రెండు ప్రపంచకప్లు అందించిన ధోని 302 వన్డేలు ఆడి 9737 పరుగులు సాధించాడు. 90 టెస్టుల్లో 4876 పరుగులు.. 78 అంతర్జాతీయ టి20 మ్యాచుల్లో 1212 పరుగులు చేశాడు. 36 ఏళ్ల ధోని ఇప్పటికీ వికెట్ల మధ్యన శరవేగంగా పరుగులు తీస్తాడు. ఈ అవార్డు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంపపెట్టు అని చెప్పవచ్చు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more