బీసీసీఐ మాజీ బాస్ గా వ్యవహరించిన శ్రీనివాసన్ కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని 2018 ఐపీఎల్ లోకి ఆడగేుపెట్టనున్న సందర్భంగా ఆ జట్టుకు అటగాళ్లు, అభిమానులు సామాజిక మాద్యమాల ద్వారా ఘనస్వాగతం పలుకుతున్నారు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ‘తలా’ అని రాసి ఉన్న 7వ నెంబరు పసుపు రంగు జెర్సీని ధరించి తన స్టైల్లో చెన్నై సూపర్ కింగ్స్ కి స్వాగతం పలికాడు. తాజాగా రవిచంద్రన్ అశ్విన్ చెన్నై జట్టు పునరాగమనం గురించి మాట్లాడారు. అయితే అదేంటో కానీ ఆయన నెట్ జనుల విమర్శలకు గురయ్యాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పునరాగమనంపై మాట్లాడుతూ... ‘రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని పునరాగమనం చేస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ మరింతగా బలోపేతం అయ్యిందని చెప్పాలనుకుని ఓ ఉదాహరణతో విమర్శపాలయ్యాడు. 1958లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో 8 మంది మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఫుట్ బాల్ క్రీడాకారులు సహా 23మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ ప్రమాదం తర్వాత ఆ జట్టు పూర్తిగా కోలుకోవడానికి రెండేళ్లు పట్టిందని.. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు బలంగా తిరిగి వస్తోందని ఉదహరించడం నెట్ జనులకు అగ్రహం తెప్పించింది.
చెన్నై జట్టును ఓ క్లబ్ జట్టుతో పోల్చడం, ఫిక్సింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొన్న జట్టును విమాన ప్రమాద ఘటనతో పోల్చడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన అశ్విన్ తన ట్విటర్ ద్వారా తన ఉద్దేశాన్ని మళ్లీ వివరించాడు. ‘ప్రమాదం కారణంగా మాంచెస్టర్ యునైటెడ్ జట్టు కీలక ఆటగాళ్లను కోల్పోయినా రెండేళ్ల తర్వాత ఎంతో బలంగా పుంజుకుందని, తాను ఆ బలం గురించి వివరించే క్రమంలోనే ప్రమాదం గురించి ఉదహరించాననని పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more