టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రీ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ గా తనవాడైన మాజీ భారత బౌలర్ భరత్ అరుణ్ ను నియమించడంలో తనదైన మార్కులోనే పయనించాడు. అటు రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్ లను స్వాగతిస్తూనే.. బిసిసిఐ ఎదుట తన షరతులను పెట్టాడు. తన షరతులకు అంగీకరిస్తేనే.. అన్న డిమాండుతో ముందుకు కదిలిన శాస్త్రి.. తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ వరకు భరత్ అరున్ ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్గా ఉన్న సంజయ్ బంగర్ను సహాయక కోచ్గా నియమించింది. ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ ఒప్పందాన్ని పొడగించింది.
కొత్తగా ఎంపికైన ప్రధాన కోచ్ రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్ గా ఉన్నప్పుడే భరత్ అరుణ్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్ గా సేవలను అందించాడు. కుంబ్లే కోచ్ కావడంతో వీరిద్దరూ ఒకేసారి జట్టును వీడారు. అండర్-19 నుంచి శాస్త్రి, అరుణ్ అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. వీరి నియామకాలను బీసీసీఐ పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ ఆమోదించారు. బ్యాటింగ్, బౌలింగ్ సలహాదారులు రాహుల్ ద్రవిడ్, జహీర్ఖాన్ పాత్రలపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు.
వీరిద్దరితో తాను వ్యక్తిగతంగా మాట్లాడినట్టు రవిశాస్త్రి తెలిపాడు. వారు అద్భుతమైన క్రికెటర్లు అన్నాడు. వారి సేవలు విలువైనవని ప్రశంసించాడు. ఐతే వారు జట్టుకు ఎన్ని రోజులు వారు అందుబాటులో ఉంటారనేది కీలకమన్నాడు. ఇదిలావుండగా, ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ నుంచి స్వచ్ఛంధంగా రాజీనామా చేసి బయటకు వెళ్లిన చరిత్రకారుడు రామచంద్ర గుహ అనుమానించినట్లే ద్రావిడ్, జహీర్ లను వెన్కక్కి తగ్గించింది బిసిసిఐ.
ఇటీవల ఈ విషయమై స్పందించిన రామచంద్ర గుహ ద్రావిడ్, జహీర్ ఇద్దరూ దేశంలో కోసం కొన్ని ఏళ్ల పాటు మైదానంలో శ్రమించారని, అలాంటి వారిని కూడా అనీల్ కుంబ్లేకు జరిగిన తరహాలో అవమానించి పంపడం సమంజసకం కాదని అన్నారు. కానీ చివరకు జహీర్ ఖాన్ ను బౌలింగ్ సలహాదారుడిగా నియమించి.. కోచ్ గా తప్పించడంతో అదే అవమానం పునరావృతమైందన్న విమర్శలు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more