కొత్త కుర్రాడు లెవిస్ విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్ తో జరిగిన ఏకైక టీ20లో విండీస్ ఘన విజయం సాధించింది. కింగ్స్టన్లోని సబీనా పార్క్లో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో నిర్దేశించిన 191 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. మెరుపులు మెరిపిస్తాడనుకున్న ఓపెనర్ క్రిస్గేల్ 18 పరుగులకే అవుటైనా, మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ భారత్ బౌలర్లను ఆటాడుకున్నాడు.
సునామీ వచ్చినట్టు ఊగిపోయాడు. బంతి కనిపిస్తే చాలు శివాలెత్తిపోయాడు. అతడి దెబ్బకు భారత బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. లెవిస్కు బంతి వేయాలంటేనా భయపడిపోయేలా చేశాడు. 62 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లెవిస్ 12 సిక్స్లు, 6 ఫోర్లతో అజేయంగా 125 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. మరో ఎండ్లో ఉన్న శామ్యూల్స్ 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్తో 36 పరుగులు చేశాడు. లెవిస్ బాదుడుతో మరో 9 బంతులు ఉండగానే విండీస్ విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్కు ఒక్క వికెట్ దక్కింది.
అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 39, శిఖర్ ధావన్ 23, రిషబ్ పంత్ 38, దినేశ్ కార్తీక్ 48, ధోనీ 2, కేదార్ జాదవ్ 4, రవీంద్ర జడేజా 13, రవిచంద్రన్ అశ్విన్ 11 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జెరోమ్ టేలర్, విలియమ్స్ చెరో రెండు వికెట్లు తీయగా, శామ్యూల్స్ ఒక వికెట్ పడగొట్టారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more