లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్.. ఒక్క మ్యాచ్ తో దేశవ్యాప్తంగానే కాదు యావత్ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాడు. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న మ్యాచ్ ను ఏకంగా ఏకపక్షంగా మార్చేసి.. ఔరా అనిపించాడు. తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ జట్టును చుట్టుముట్టాడు. అనూహ్యరీతిలో ప్రత్యర్థులను టపాటపా ఆరు వికెట్లు పడగొట్టిన నేపథ్యంలో చాహల్ భారత్ తరపున అరుదైన ఘనతను అందుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అరు వికెట్లను తీసి ఉత్తమ గణంకాలను నమోదు చేసి రికార్డు నెలకొల్పాడు.
రెండో ఇన్నింగ్స్ లో 13వ ఓవర్లో 119/2 వికెట్లతో బలంగా కనిపించిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత కేవలం 8 పరుగులు జోడించి చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అందుకు కారణం యువ స్పిన్నర్ చాహల్ మాయాజాలమే. అతను స్పిన్ బంతులను ఎదుర్కోలేక ఇంగ్లండ్ బ్యాట్స్మన్ చేతులెత్తేశారు. దీంతో ఆరు వికెట్లను కొల్లగొట్టిన చాహల్ తన కెరీర్లోనే తొలిసారి ఉత్తమ గణాంకాలను నమోదుచేశాడు. మూడవ టీ-20లో స్టార్ ఆఫ్ ద నైట్గా నిలిచాడు.
ఆరు వికెట్లు పడగొడతానని తాను కలలో కూడా అనుకోలేదని మ్యాచ్ అనంతరం చాహల్ చెప్పాడు. బెంగళూరులో తొలిసారి టీమిండియా తరఫున ఆడటం ఆనందం కలిగించింది. సొంతూరులో ఉండి ఆడినట్టు అనిపించింది. ఆరు వికెట్లు తీస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పాడు. 25 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన చాహల్ భారత్ తరఫున టీ-20లో ఉత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ-20 మ్యాచ్లలో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more