పంజాబ్ లోని మోహాలీ స్టేడియం వేదికగా ఐదు వన్డేల సిరీస్లో భాగంగా పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో మరో మ్యాచ్లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్ లోనూ అలాగే ప్రణాళికలే రచించినా అది కాస్తా గతి తప్పింది. ఫిరోజ్ షా కోట్లా మైదనాంలో జరిగిన రెండో వన్డేలో కివీస్ గెలుపోందారు. దీంతో ఇక నుంచి జాగ్రత్తాగా అడి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా క్రికెటర్లు భావిస్తున్నారు. కాగా రెండో వన్డే గెలిచిన అనందంలో మునిగి తేలుతున్న న్యూజీలాండ్.. అదే ఉత్సాహంతో మూడో వన్డేలోనూ విజయాన్ని అందుకోవాలని ఉబలాటపడుతుంది. దీంతో ఇరు జట్ల మధ్య జరిగనున్న మూడో వన్డేలో మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది.
గత మ్యాచ్లో మూడు మార్పులతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు భారత్ తొలి రెండు వన్డేల్లో కొనసాగించిన తుది జట్టుతోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా అరోగ్యం ఇంకా కుదుటపడకపోవడంతో మూడో వన్డేకు కూడా అయన అందుబాటులోకి రాలేదు. దాంతో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మంచి టచ్ లోకి వచ్చాడు.
ఇదిలావుండగా, మొహాలీలో భారత్ జట్టు మంచి వన్డే రికార్డును కల్గి వుంది. ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(పీసీఏ)లో ఇప్పటివరకూ భారత్ ఓవరాల్ గా 13 వన్డేలు ఆడగా, ఎనిమిదింట విజయం సాధించింది. ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ స్టేడియంలో భారత్ తొలిసారి 1993లో దక్షిణాఫ్రికాపై గెలవగా, చివరిసారి 2013 లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఓటమి పాలైంది. కాగా, 2016లో ఇక్కడ ఆస్ట్రేలియాతో చివరిసారి ఆడిన వరల్డ్ టీ20లో భారత్ జయకేతనం ఎగురవేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more