ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించిన అస్ట్రేలియన్లను ఇటీవల జరిగిన ఐదు వన్డేల సిరీస్లో పూర్తిగా వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. వారితో జరగనున్న టెస్టు సిరీస్ లోనూ అదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తుంది. ఇందుకు గాను అప్పడే మైండ్ గేమ్ ను కూడా ప్రారంభించింది. అసలే వన్డే సిరస్ ను కోల్పోయి పీకల్లోతు పరాభవంతో కుంగిన ఆస్ట్రేలియాను మరింతగా కృంగిపోయేట్లు చేయడంలో అప్పడే సఫారీల నాయకుడు డు ప్లెసిస్ వారిపై ప్రభావవంతమైన వ్యాఖ్యలను చేశాడు.
వన్డేల్లో కంగారులకు మరచిపోలేని స్ట్రోక్ ఇచ్చామని, టెస్టు సిరీస్ లోనూ అదే స్ట్రోక్ పనిచేస్తుందని కెప్టెన్ డు ప్లెసిస్ అంటున్నాడు. ఆసీస్ స్లెడ్జింగ్ కు తామిచ్చిన స్ట్రోక్ చాలా బాగా పనిచేస్తుందని అయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తామిచ్చిన స్ట్రోక్ కంగారులకు చాలాకాలం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకమని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన సిరీస్లో ఆసీస్ అలా ఓడిపోవడం ఆ జట్టును మానసికంగా బలహీనపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.
'మాతో టెస్టు సిరీస్కు వారు డిఫరెంట్ జట్టుతో వస్తారు. వన్డేల్లో కంటే మంచి జట్టుతోనే ఆసీస్ టెస్టు సిరీస్ కు సిద్ధమవుతుంది. టెస్టు సిరీస్ లో మంచి ఆరంభాన్ని దక్కించుకోవాలంటే నాణ్యమైన జట్టు అనేది ముఖ్యం. మాతో జరిగిన వన్డే సిరీస్ వారికి మరచిపోలేని అనుభవం. అది ఆసీస్ కు ఎదురైన చిన్న దెబ్బ కాదు.. ఆ జట్టును మానసికంగా బలహీనపరిచే స్ట్రోక్' అని డు ప్లెసిస్ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more