టీమిండియా కెప్టెన్ గా కోనసాగుతారా..? లేక కెప్టెన్సీ పగ్గాలను టెస్టు మ్యాచ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అప్పగిస్తారా..? అన్న ప్రశ్నలు మీడియా నుంచి ఎదురవుతున్న ప్రతీసారి ఎంతో ఒప్పిగ్గా సమాధానమిచ్చారు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. మరోమారు న్యూజీలాండ్ తో సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో ఇలాంటి ప్రశ్నలే మళ్లీ ఉత్పన్నమయ్యే అవకాశాలు వున్నాయి. కాగా అది సరైన చర్య కాదని అంటున్నాడు మాజీ భారత సెలక్టర్ ప్రణబ్ రాయ్.
2004లో బంగ్లాదేశ్ వన్డే సిరీస్లో ధోని ఎంపిక కావడానికి ప్రధాన కారణమైన ప్రణబ్ రాయ్.. ఇంకా భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ను మార్చాల్సిన అవసరం రాలేదంటున్నాడు. 'కెప్టెన్సీ నుంచి ధోని ఎప్పుడు వైదొలగాలో అతనికి తెలుసు. ప్రస్తుతం ధోనికి ప్రత్యామ్నాయం లేదు. అతను ఒక ఆటగాడిగా, నాయకుడిగా సక్సెస్ అయ్యాడు. అసలు కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచనే వద్దు. కోహ్లికి బాటన్ ఎప్పుడు ఇవ్వాలో ధోనికి తెలుసు'అని ప్రణబ్ రాయ్ తెలిపాడు.
గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన పలు టెస్టు మ్యాచ్లను కోల్పోవడంతో ధోని ఆకస్మికంగా ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అతని నిర్ణయం తనను ఆశ్చర్య పరిచింది. 90 టెస్టుల్లో ఆడిన ధోని ఆ తరహా నిర్ణయం తీసుకుంటాడని అస్సలు అనుకోలేదని ప్రణబ్ తెలిపాడు. కాగా, అతను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయానికి అంతా గౌరవం ఇవ్వాలన్నాడు. అయితే ఒక సెలక్టర్ గా ధోని ఎంపిక చేయడం తన అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుందన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more