వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్ విజయం దక్కించుకుంది. 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్... ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మూడవ టెస్టులో ఫలితం తేలుతుందా.? లేదా..? అన్న అభిమానుల ఉత్కంఠకు తెరదించుతూ.. కోహ్లీ సేన విజయాన్ని నమోదు చేసింది.
ఈ పర్యటనలో తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా.. రెండో టెస్టుపై కూడా పూర్తి పట్టు బిగించింది. అయితే అనూహ్యంగా వరుణడు ఈ మ్యాచ్ కు నాల్గవ రోజు అడ్డంకిగా నిలచి.. వీండీస్ కు మద్దతుగా నిలిచి.. టీమిండియా విజయాన్ని అడ్డుకున్నాడు. అదే తరహాలో మూడోవ టెస్టులోనూ వరుణడు అడ్డంకిగా నిలచి ఫలితం తేల్చుతాడా లేదా..? అన్న సందేహాలను పటాపంచలు చేశాడు. టీమిండియా అద్భతు బౌలింగ్ తో మూడో టెస్టులో విజయాన్ని అందించాడు.
వెస్టిండీస్ను మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 157 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదవ రోజు బరిలోకి దిగిన కోహ్లీ సేన ఏడు వికెట్ల కోల్పియి 217 పరుగుల వద్ద వుండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్కు 346 పరుగుల ఆధిక్యం లభించింది. చివరకు టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి 237 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. 346 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్లు... రెండో ఇన్నింగ్స్లో 47.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటయ్యారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 48 ఓవర్లలో ఏడు వికెట్లకు 217 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 353; రెండో ఇన్నింగ్స్ 217/7 డిక్లేర్
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 225 ఆలౌట్: రెండో 108 అలౌట్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more