నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో కింగ్స్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియ విండీస్ పై 304 పరుగుల అధిక్యాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 500 పరుగుల వద్ద తొమ్మిది విక్కట్ల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ వెస్టిండీస్తో అడిన తొలి టెస్టులోనే 158 పరుగులను సాధించగా, వైస్ కెప్టెన్ అజింక్య రహానే అజేయ సెంచరీ( 237 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన నిలకడ ఆటతీరును మరోసారి నిరూపించుకున్నాడు.
టీమిండియా 2013-14లో చేసిన దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ప్రతి టెస్టు సిరీస్ లో నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడు రహానే. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఫీట్ సొంతం చేసుకున్నాడు. వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్ లలో భాగంగా ప్రతి టెస్టులో కనీసం ఒక ఇన్నింగ్స్ లో 90 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే ఏడు టెస్టు సెంచరీలు చేయగా, అందులో 5 ఉపఖండం బయట చేసినవే. దక్షిణాఫ్రికాపై (96), బంగ్లాదేశ్ పై (98) రెండు సెంచరీలను మిస్సయ్యాడు.
మరోవైపు విండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్(5/121) చెలరేగుతున్నా మరో ఎండ్ లో పాతుకుపోయిన రహానే, సాహా(47), మిశ్రా(21), ఉమేశ్ యాదవ్(19)లతో కలిసి భాగస్వామ్యాలు నిర్మించి భారత్ను పటిష్టస్థితికి చేర్చాడు. 500 పరుగుల వద్ద 9వ వికెట్ గా ఉమేశ్ యాదవ్ (14 బంతుల్లో 19 పరుగులు; 4 ఫోర్లు) చేజ్ బౌలింగ్లో ఔట్ కావడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో భారత్కు 304 పరుగుల ఆధిక్యం లభించింది. వర్షం కారణంగా విండీస్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించలేదు. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 196 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more