కింగ్ స్టన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ టెస్ట్లో ఓపెనర్ లోకేష్ రాహుల్ అద్భుత శతకంతో రాణించింది. విండీస్ తో అడిన తొలిమ్యాచ్ లోనే లోకేష్ రాహుల్ 158 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మురళీ విజయ్ గాయం కారణంగా మ్యాచ్కు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన రాహుల్ తనకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. 303 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లు, 52.15 స్ట్రైక్ రేట్తో 158 పరుగులు చేశాడు. అయితే తాను ఈ స్కోర్ చేసేన క్రమంలో పలు రికార్డుల నమోదయ్యాయి.
వెస్టిండీస్తో ఆడిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసిన తొలి భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లోకేష్ రాహుల్. ఒక భారత బ్యాట్స్మెన్గా వెస్టిండీస్లో ఓపెనింగ్కు దిగి తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు లోకేశ్ రాహుల్ ముందు వరకూ ఎవరూ లేరు. అయితే అంతకుముందు 1997లో అజయ్ జడేజా విండీస్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా తాను ఆడిన తొలి మ్యాచ్లో చేసిన 96 పరుగులే ఇప్పటివరకూ అత్యధికమైనవి. అయితే ఓపెనర్గా బ్యాటింగ్కు దిగకపోయినప్పటికీ వెస్టిండీస్లో ఆడిన తొలి మ్యాచ్లో సెంచరీలు నమోదు చేసిన భారత ఆటగాళ్లు మొత్తం ఐదుగురు. వారిలో లోకేష్ చేసిన 158 పరుగులే అత్యధికమైనవి.
ఆ ఐదుగురు భారత ఆటగాళ్ల వివరాలు..
1) లోకేష్ రాహుల్ 158 పరుగులు - 2016లో
2) పాలి ఉమ్రిగర్ 130 - 1953లో
3) బ్రిజేష్ పటేల్ 115 - 1976లో
4) అశ్విన్ 113 - 2016లో
5) సంజయ్ మంజ్రేకర్ 108 - 1989లో
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more