టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్, మరో ఛారిటీ సంస్థ స్మైల్ ఫౌండేషన్ కలసి ముంబైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఛారిటీ కార్యక్రమంలో కోహ్లీ, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా స్టెప్పులతో అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో టీమిండియా టి-20, వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కె.ఎల్ రాహుల్, అజింక్యా రహానేతో పాటు ఆకాశ్ అంబానీ, గౌతమ్ సింఘానియా, నికిల్ చతుర్వేది, దిగ్విజయ్ సిన్హ్ కతివాడా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. క్రికెటర్లు చిన్నారులతో ఫొటోలు దిగి సందడి చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమానికి ముందు అనూహ్య సంఘటన జరిగింది. మీడియా ప్రతినిధులు ఊహించని ప్రశ్న అడిగే సరికి యువరాజ్ సింగ్ శాంతం కోల్పోయాడు. ఒక్కసారిగా యువీకి ఒకింత కోపం వచ్చింది. యువీ సహనం కోల్పోయేలా చేసిన ఆ ప్రశ్న ఏంటంటే.. అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీని నియమించే అవకాశం గురించి మీడియా ప్రతినిధులు అడిగారు. 'ఈ ఈవెంట్ గురించి మాట్లాడేందుకు ఇక్కడి వచ్చా. క్రికెట్ గురించి మాట్లాడేందుకు కాదు. ఓకే..? థ్యాంక్యూ' అంటూ మీడియా ప్రతినిధులకు మరో ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వకుండా యువీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా యువీ ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఈవెంట్లో అందరితో కలసి హుషారుగా పాల్గొన్నాడు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more