టీ20 ప్రపంచ కప్ క్రికెట్ లో సెమీఫైనల్స్ లో పరాజయం పాలైన నేపథ్యంలో మళ్లీ తెరపైకి తన రిటైర్మెంట్ అంశం తలెత్తడంపై విదేశీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని విభిన్నంగా స్పందించాడు. విండీస్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని విలేకరులతో మాట్లాడుతుండగా ఆస్ట్రేలియా జర్నలిస్ట్ శామ్యూల్స్ ఫెర్సిస్ ఈ ప్రశ్న వేశాడు. వెంటనే స్పందించిన ధోని అతడిని తన పక్కన కూర్చోమని కుర్చీ చూపిస్తూ వేదికపైకి ఆహ్వానించాడు.
అతడు కుర్చీలో కూర్చొగానే భుజంపై చేయి వేసి సరదాగా ఎదురు ప్రశ్నలు వేశాడు. నేను రిటైర్ కావాలని కోరుకుంటున్నావా అని ప్రశ్నించాడు. 'నో నేను కోరుకోవడం లేదు. రిటైర్మెంట్ పై మీరేం చెబుతారో వినాలనుకుంటున్నా' అని ఫెర్సిస్ సమాధానం ఇచ్చాడు. 'భారత జర్నలిస్టులు ఎవరైనా ఈ ప్రశ్న వేసుకుంటే మీ కొడుకు లేదా తమ్ముడెవరైనా వికెట్ కీపర్ గా ఉన్నారా అని అడిగేవాడిని. ఎందుకంటే నేను తప్పుకుంటే వారికి అవకాశం దక్కుతుంది కాబట్టి. కానీ నిన్ను ఆ ప్రశ్న అడగలేకపోతున్నాను. నేను ఫిట్ గా లేనని భావిస్తున్నావా, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం లేదా' అని ధోని ప్రశ్నించాడు.
'నో.. నువ్వు చాలా వేగంగా పరుగెడుతున్నావు' అని ఫెర్రిస్ జవాబిచ్చాడు. '2019 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడలేనని భావిస్తున్నావా' అని మళ్లీ ధోని ప్రశ్నించగా 'అదేమి లేదంటూ' ఫెర్రిస్ బదులిచ్చాడు. 'నీ ప్రశ్నకు నువ్వే సమాధానం ఇచ్చావు' అంటూ మిస్టర్ కూల్' అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more