ప్రపంచ కప్ టీ 20 లో భాగంగా ఇవాళ ముంబయిలోని వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న రెండు సెమీ ఫైనల్స్ సమరానికి ఇరు జట్టు సన్నధమవుతున్నాయి. ఈ మ్యాచ్ లో విజయాన్ని అస్వాధించి, ఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో తలపడేందుకు రెండు జట్లు వ్యూహ ప్రతి వ్యూహాలను పన్నుతున్నాయి. టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన ఆరంభ మ్యాచ్ లో న్యూజీలాండ్ చేతిలో పరాజయం పోంది, అక్కడి నుంచి సత్తా చాటుకుంటూ వచ్చిన టీమిండియా అన్ని మ్యాచ్ లలో నెగ్గి సెమీస్ కు చేరింది.
కాగా వెస్టీండీస్ మాత్రం సమఉజ్జీలైన అన్ని జట్లపై గెలుపోంది.. చివరకు పసికూన అప్ఘనిస్తాన్ చేతిలో మాత్రం ఓటమిని చవిచూసింది. అయితే అప్పటికే సెమీస్ లోకి తన స్థానాన్ని ఖాయం చేసుకోవడంతో ఆ మ్యాచ్ ఫలితం ఆటపై పెద్ద ప్రభావాన్ని చూపలేదు. దీంతో వరుసగా మూడు మ్యాచులు గెలిచి చివరి మ్యాచ్ లో ఓడిన విండీస్ ఇవాళ ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లో టీమిండియాతో తలపడేందుకు సన్నధమవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో రెండు జట్లకు విజయావకాశాలు వున్నాయి.
అయితే టీమిండియా ఓపెనర్లు, సురేష్ రైనా చక్కని ఫామ్ ను అందుకుంటే.. ఇప్పుడున్న భారత జట్టును ఓడించడం ఎవరి తరం కాదన్న వాదనలు వున్నాయి. ఇప్పటికే టీమిండియా ఓపెనర్లతో పాటు సురేష్ రైనా ప్రదర్శనపై భారత క్రికెట్ అభిమానుల్లో విమర్శలు వెల్లువెతుతున్నాయి, ప్రపంచ కప్ ప్రారంభం నుంచి వీరు ముగ్గురిలో ఎవరూ సరిగా రాణించలేదని క్రికెట్ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. బంగ్లాదేశ్ వంటి జట్లతో పరాజయం అంచులకు వెళ్లిన మ్యాచ్ ను చాకచక్యంగా విజయతీరాలకు చేర్చాల్సిన అవసరం రావడం కూడా భారీ స్కోరును సాధించలేకపోవడమేనన్న విమర్శలు కూడా వినిసిస్తున్నాయి.
భారత్తో జరగబోయే సెమీస్లో తన ఫోకస్ అంతా బౌండరీ లైన్ పైనేనని వుంటుందని ఇప్పటికే స్పష్టం చేసిన వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తన పేరున మరో రికార్డును లిఖించుకునేందుకు సిద్దమయ్యాడు. ఆయనతో పాటు టీమిండియా కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కూడా రికార్డును క్రియేట్ చేసే పనిలో వున్నాడు. భారత్ తో జరగనున్న సెమీ ఫైనల్స్ లోనూ చెలరేగి ఆడటమే తన లక్ష్యమని తేల్చిచెప్పిన గేల్.. ఇవాళ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. కసీనం ఈ మ్యాచ్ లోనైనా టీమిండియా తమ స్థాయికి తగిన ఆటను అడుతుందో లేదో వేచి చూడాలి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more