చుట్టూ పర్వతాలు, ప్రకృతి సౌందర్యం మధ్య ధర్మశాల క్రికెట్ స్టేడియం మనోహరంగా ఉంటుంది. ఏ అవాంతరాలూ ఎదురుకాకుండా ఉన్నట్టయితే ఈ వేదికలో ఈ నెల 19న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మ్యాచ్ జరిగేది. అయితే భద్రత కల్పించలేమని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా మ్యాచ్ను వ్యతిరేకించడం.. ఈ పర్యవసానాల వల్ల ధర్మశాలలో తాము ఆడబోమని పాకిస్తాన్ షరతుపెట్టడంతో వేదికను కోల్కతాకు తరలించారు.
అయితే ఈ విషయంలో ధర్మశాల స్టేడియం నిర్వాహకులకు గాని, స్థానిక క్రికెట్ బోర్డుకు గానీ సంబంధం లేదు. భారత్-పాక్ మ్యాచ్ జరగాలనే కోరుకున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల కారణంగా ధర్మశాల స్టేడియం మూల్యం చెల్లించుకుంటోంది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని ఈ స్టేడియం కోల్పోయింది. హోమ్ టీమ్ కింగ్స్ లెవెన్ పంజాబ్ తమ మ్యాచ్లను ధర్మశాల నుంచి నాగ్పూర్కు తరలించాలని బీసీసీఐని కోరింది. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఐపీఎల్ షెడ్యూల్లో ధర్మశాలను వేదికగా చేర్చలేదు. ఆటగాళ్లకు భద్రత ఏర్పాటు చేసినందుకుగాను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేయడం, వినోదపు పన్ను కారణంగా ఈ వేదికలో ఐపీఎల్ మ్యాచ్లు ఆడేందుకు కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆసక్తి చూపడం లేదు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం ప్రతినిధి సంజయ్ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం రాజకీయాలే దీనికి కారణమన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more