వరుసగా భారీ విజయాలు.. దీనికితోడు సొంత గడ్డపై ఆడుతుండటం.. టీ-20 ప్రపంచ కప్ లో ధోనీ సేనకు కలిసొచ్చే అంశం. అయితే, ట్వంటీ-20 అనేది చాలా అనిశ్చితి కూడుకున్న ఫార్మెట్. ఏ రోజు ఎవరు గెలుస్తారో ముందే చెప్పడం చాలా కష్టం. అందుకే రానున్న టీ-20 వరల్కప్ను తాము అంతగా ఈజీగా తీసుకోవడం లేదని, తొలి బంతి నుంచే ఫోకస్ పెట్టి ఆడేందుకు ప్రయత్నిస్తున్నామని టీమిండియా మహేంద్రసింగ్ ధోనీ స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డ మీదనే ఓడించడం, శ్రీలంకను, బంగ్లాదేశ్ ను చిత్తుచేసి ఆసియా కప్ను సాధించడంతో ధోనీ సేన మాంఛి ఊపు మీద ఉంది. ఆసియా కప్ను ఘన విజయంతో ముగించి.. టాప్ గేర్లో వరల్డ్ కప్ లోకి ఎంటరవుతున్నది. ఈ నేపథ్యంలో హోమ్ టీమ్ ఫేవరెట్ అని పరిశీలకులు కూడా స్పష్టం చేస్తున్నారు. టీమిండియా మరోసారి పొట్టి వరల్డ్ కప్ను గెలుచుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఈ అంచనాలు తమలో ఉత్సాహాన్ని పెంచుతున్నప్పటికీ సీరియస్గానే తాము టీ-20 వరల్డ్ కప్లోకి ఎంటరవుతున్నట్టు ధోనీ స్పష్టం చేశాడు. 'ప్రస్తుతం మేం సిక్స్త్ గేర్లో దూసుకుపోతున్నాం. టెక్నాలజీ మాత్రం ఎనిమిదో గేర్ వరకు అభివృద్ధి చెందింది. అయితే, ఏ లెవల్ గేమ్ కైనా మేమున్న ఫామ్ సరిగ్గా సరిపోతుంది. మొదటి బంతి నుంచే మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది. ప్రస్తుతం అంతా సిద్ధమైంది. ఇంకా గేర్ల ప్రసక్తే అవసరం లేదు. ఇక ఆడటమే తరువాయి. అందుకు సర్వసన్నద్ధంగా జట్టు ఉండటం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది' అని ధోనీ పేర్కొన్నాడు.
టీ-20 వరల్డ్ కప్లో టీమిండియా తన ప్రస్తానాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించనుంది. తొలి మ్యాచులో న్యూజిల్యాండ్ను ధోనీ సేన ఎదుర్కొంటుంది. యువద్వయం జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా జట్టు అంచనాలకు తగ్గట్టు రాణిస్తుండటం, వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా జట్టు సమర్థంగా ఉపయోగపడుతుండటం చాలా ఆనందం కలిగిస్తోందని, తమ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగా ఆడుతోందని ధోనీ చెప్పాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more