ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన టోర్నీలో అత్యంత అరుదైన వింత ఘటన చోటుచేసుకుంది. ఆ మ్యాచ్ ఫలితం గురించి తెలుసుకున్న బిత్తరపోయింది. కెంట్ ప్రాంతంలోని కంటెర్ బరీ స్టేడియంలో ఓ ప్రాంతీయ టోర్నమెంట్లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన టోర్నమెంటులో బాష్ ఛైల్డ్ జట్టు, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ జట్లు ఫైనల్ చేరాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన క్రైస్ట్ చర్చ్ యూనివర్సీటీ జట్టు 120 పరుగులు చేసింది. 121 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బాష్ చైల్డ్ జట్టు కేవలం 20 బంతులను ఎదుర్కొని 10 వికెట్లు కోల్పోయింది.
ఈ మొత్తం బ్యాటింగ్ లో కేవలం ఒక్కబంతిని మాత్రమే బ్యాటుతో బ్యాట్స్ మన్ అడ్డుకోవడం విశేషం. దీంతో స్కోరు బోర్డుమీద పరుగులేమీ చేయకుండా ఆ జట్టు పెవిలియన్ చేరింది. ఈ ఫలితం గురించి విన్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బిత్తరపోయింది. ఎలా స్పందించాలో కూడా వారికి తెలియలేదు. కనీసం గల్లీ టోర్నీలో కూడా ఇలాంటి ఫలితం నమోదై ఉండదని అధికారులు అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి క్రికెట్ లో అయినా ఇదే రికార్డేమో... ఇలాంటి రికార్డు నమోదయ్యే అవకాశం కూడా ఉండదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more